"తెలుగు శాఖ, స్నాతకోత్తర కేంద్రం గద్వాల, పాలమూరు విశ్వవిద్యాలయంలో నేను బోధించే సిలబస్, సిలబస్ లోని పాఠ్యాంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ప్రతిబింబించే వేదిక."

దిక్సూచి – చెరబండరాజు  


  విప్లవ కవుల్లో విశిష్టమైన వ్యక్తిత్వంగల మహాకవి చెరబండరాజు 38 ఏళ్ల చిరుప్రాయంలోనే అస్తమించాడు. కాని విప్లవమార్గం చేపట్టి కొనసాగిన కొన్ని ఏళ్ల కాలం లోనే ఆయన రాసిన అనేక కవితలు, ముఖ్యంగా పాటలు తెలుగు ప్రగతిశీల ప్రజానీకాన్ని ఉర్రూతలూగించాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి మహాకవి దిక్‌సూచిలోని కవితలు ఎంపిక చేసి కొన్ని ఇక్కడ ఇస్తున్నాము. మన బ్లాగు పాఠకులు వీటిని విశేషంగా ఆదరిస్తారని ఆశిస్తాం....

"ఏటికేతం బెట్టి
ఎయిపుట్లు పండించి

గంజిలో మెతుకెరగనన్నా – నేను
కూటిలో మెతుకెరగనన్నా"
అంటూ డెబ్భై ఏళ్ల కర్షక జీవితంలో
ఈ పాటే పాడుకుంటూ కన్ను మూసిన

నాన్నకి ప్రథమ ముద్రణ, అక్టోబరు 1970

1. వందే మాతరం
 నా ప్రియమైన మాతృదేశమా
తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా
దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది
అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టుపెట్టిన అందం నీది
సంపన్నుల చేతుల్లో మైమరిచి నిద్రిస్తున్న యవ్వనం నీది
ఊసినా దుమ్మెత్తిపోసినా చలనంలేని మైకం నీది
కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న
ఎలకల్నీ పందికొక్కుల్నీ భరిస్తూ నుంచున్న 'భారతి' వమ్మా
నోటికందని సస్యశ్యామల సీమవమ్మా
వందే మాతరం వందే మాతరం
ఒంటిమీది గుడ్డలతో జండాలు కుట్టించి
వివస్త్రవై ఊరేగుతున్న దైన్యం నీది
అప్పుతెచ్చి లేపిన మిద్దెల్లో
కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది
ఎండిన స్తనాలమీదికి ఎగబడ్డ బిడ్డల్ని
ఓదార్చలేని శోకం నీది
ఆకలికి ఎండి ఎండి ఎరువు సొమ్ములతో వీధినబడ్డ సింగారం నీది
అమ్మా భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ
వందే మాతరం వందే మాతరం
దిక్‌సూచి, చెరబండరాజు, ప్రథమ ముద్రణ, అక్టోబరు 1970, హైదరాబాదు నుండి...
2. నన్నెక్కనివ్వండి బోను
నల్లకోట్లు నీలిరంగు నోట్లతో
ఒక దేశం ఒక కోర్టులో
ఫైసలా అయ్యే కేసు కాదు నాది
నన్నెక్కనివ్వండి బోను
నలుగురి నమ్మికతో 'అమ్మా ' అని పిలవడం తప్ప
నవమోసాలు మోసిందెవరో
ఎవరికైనా ఏమి తెలుసంటున్నాను
సృష్టికర్తనే వెక్కిరిస్తోన్న పాపిష్టిని
మీలో మిమ్మల్ని ప్రశ్నించుకొమ్మంటున్నాను
అంటున్నాను అంటాను
అనుకుంటూనే వస్తున్నాను
మనిషిమీద నమ్మకం పోగొడుతున్న మీరు
దేవుడిమీద ప్రమాణం చేయమంటారెందుకు?
దోషికి నిర్దోషికి ఒకటే సూత్రం
వల్లించిందే వల్లించి వాదిస్తారు
ఫీజు కుడితి కుండలో
న్యాయాన్ని ఎలుకలా ముంచేస్తారు
మీ ఉద్యోగాలకు ప్రమాణాలేమిటి?
ఎక్కనివ్వండి నన్ను బోను
కలాలు కాగితాలు సర్దుకోండి
లా బుక్కుల్లో నా సందేహాలు వ్రాసుకోండి
న్యాయానికి దేశాలేమిటి? యెల్లలేమిటి?
మనిషీ, రక్తం ప్రాణం ముఖ్యం
లింగ భేదాలు వాదాలు తప్పితే
మందిర్, మస్జిద్, చర్చి,
మతాధికారుల మతాలు యెందుకు?
ఆకలి, కామం, కలలూ, కన్నీళ్లు
మనిషిలోని మర్మజ్ఞానమంతా ఒక్కటే
దేశమేదైతేనేం? మట్టంతా ఒక్కటే
అమ్మ యెవరైతేనేం? చనుబాల తీపంతా ఒక్కటే
బిక్కముఖాలతో చూస్తారేం?
పిచ్చివాణ్ణిగా కేసు పుటప్ చెయ్యండి
నన్నెక్కనివ్వండి బోను
తిన్నయింటి మర్యాదెంచని నాకు
బుద్ధుల్లో పెద్దల సహజాతాలేమై యుంటాయ్?
మంచి మనసు పరిమళాలు
విశ్వవ్యాప్తి కాకపోవు
భావితరం గుర్తించకపోదు
జగత్ప్రళయ కావ్యంలో
తపనాగ్ని జ్వాల నిలుస్తోంది
అణువణువున అగ్ని కణం
చల్లారక రగులుతోంది
నన్నెక్కనివ్వండి బోను
తీర్పు మీది జైలు మీది
భయపడతారెందుకు
మీ మనస్సౌధాల నిండా
తరగని తరతరాల బూజు
అనుక్షణం చచ్చే ప్రియత్వం
కాపురాల గోపురాలలో తిరిగే పావురాళ్ళారా!
నరుక్కోరెందుకు తలలు
గది నాల్గు గోడలు కూల్చివేసి
దిశలు నాల్గుగా మార్చుకోండి
ప్రపంచ పౌరులు కారెందుకు అప్పుడు?
నాకు తెలుసు
మీ రాత్రి చొక్కాలు పగళ్ళు నిలవవు
పగటి చొక్కాలు రాత్రుళ్లుండవు
మీ పెళ్ళాలు పిచ్చివాళ్ళు
పాతికచీరతో స్వర్గాన్ని కప్పుకొని
వంటగది ఆలోచనలకు
ఎసర్లు పెడుతున్న వాళ్ళు
మీ వాగ్దానాలు పుచ్చుగింజలు
మీ బిడ్డలు కృత్రిమ నాగరికత షో లో
మోడల్‌గా పనికొస్తున్న వాళ్లు
ఛీ, ఛీ యెవరు మీరు?
నవ్వుతా రెందుకు?
నీవు నేను కలిసి యెదుటివాని పిలుపుకు
'మీరు ' గాక ఏమౌతాం?
నీ గుండెలు, నా గుండెలు
మూతబడిన కొండగుహలు
ఎక్కనివ్వండి నన్ను బోను
ఈ సువిశాలప్రపంచ జీవశాలలో
సిసలైన న్యాయస్థానం ఎక్కడైనా వుంటే
నన్నెక్కనివ్వండి బోను
నా గుండెలు పిండుకునే
కొండల్లాంటి సందేహాలు...
విశ్వశాంతి మన ధ్యేయం
యుద్ధాలకు పరిమితమా?
అబద్ధమా యీ వేదన?
మాంసం ముద్దలుగా మనుషులు
శిశువులుగా జన్మించుట ఏ దేశంలో లేదు
ఏ దేశంలో నైతేనేమి?
అర్ధరాత్రి పడగ్గదుల
అంతరార్థమొకటే గద!
ప్రపంచ మొక నగ్నశిలా
ఫలకము వలె కనిపిస్తున్నది
భగవంతుడి అసలు పేరు నగ్నప్రియుడంటాను
అంటాను అంటున్నాను
అనుకుంటూనే వస్తున్నాను
అందుకే నన్నెక్కనివ్వండి బోను
* * * * *
3. చితి పేర్చుకుందాం
4. చూడలేను
5. ఇంకా నువ్వింకా బానిసవే
6. నీరో సంతతి
7. జవాబు
8. ఆకాశం వెక్కి వెక్కి ఏడుస్తోంది
9. ఊబి
10. కో
11. నా మనుష్య ప్రపంచంలోకి 
12. ఫో
13.  అన్నీ మరణాలే 
14. కాంతి పాదాలు
15. ఆత్మ దిక్
16. నా ఆకాశం
17. రా!
18. దిగంబర సమాజం కోసం
భుజాలు జార్చుకొని
మర్రి ఊడల్లా చేతులు వేలాడేసి
ఒంగి ఒంగి మట్టి కరుస్తూ నడుస్తోన్న
కుంటి వ్యవస్థను నిలబడిన చోటే
గొయ్యి తవ్వి పాతెయ్యమంటున్నా
చాకులా వెన్నెముక ఉంటే
కంఠ కంఠాలలో నిప్పు రగల్చమంటున్నా
నపుంసక మానసిక అంటువ్యాధి
ముందు తరాలకు అంటకుండా
తలవంచుక వెళ్ళిపోదామనే తార్పుల
అగ్ని కీలలలో తలకిందులుగా నిలెయ్యమంటున్నా
ఈ అవ్యవస్థ వ్యవస్థాపకుల్ని
ఇంకా ఇంకా బజార్ల కీడ్చి
చౌరస్తాలోకి వీలుగా చేరెయ్యమంటున్నా
పొద్దుపొడుపుతో మోసగించి మతాలు
గానుగెద్దులుగా మార్చిన రాజకీయాలు
పశుత్వం మిగిల్చిన జాతిద్వేషాలు
దుర్గంధం కక్కిన సిద్ధాంతాలు
నిన్నూ నన్నూ ఇన్నాళ్లూ కమ్ముకున్నాయ్
వ్యవస్థేదీ మిగల్లేదు
అందుకే
ఈ కుంటి జీవచ్ఛవాన్ని నిలబడిన చోటే
గొయ్యి తవ్వి పాతెయ్యమంటున్నా
* * * * *
19. నిమిషం నిమిషం ఒక నిమిషం
20. కుక్కల మేళం
21. యాభై కోట్ల మంటలు
యాభై కోట్ల మంటలు
యాభై కోట్ల కంఠాలు
తిరుగుబాటు మంటలుగా మారాలి
వాస్తవ జీవితాన్ని వేల మైళ్ల దూరంలో విసిరేసిన
విద్యాలయాలు వదిలి
జట్లు జట్లుగా మెట్లు మెట్లుగా
యువకులు నడిరోడ్డుకు పరుగెత్తుకు రావాలి
మూఢనమ్మకాల ఉక్కు కౌగిళ్లలో
నంగనాచి నాయకుల దొంగ వేషాల్లో
నలిగే కృంగే జనం కళ్లగంతలు చించుకొని బయటికి రావాలి
మహావ్యవస్థ రూపొందించని నాయకులు
జనాన్ని జేజమ్మలుగా వాజమ్మలుగా
పురుగులుగా వెధవలుగా
ఎట్లా దిగజార్చారో
ఒక్కసారి వెన్నుతట్టి కళ్ళారా చూపించాలి
యాభై కోట్ల కంఠాలు
తిరుగుబాటు మంటలుగా మారాలి
* * * * *
22. నేనే మీ ఊపిరి
23. మంటలెప్పుడోగాని అంటుకోవు
24. రక్త ఘోష
25. చిలుం
26. కన్నీళ్లేనా
27. జగద్గురువులొస్తున్నారు జాగ్రత్త
జగద్గురువులొస్తున్నారు జాగ్రత్త
పల్లకీలలో తప్ప ప్రయాణం చేయరు
ధనవంతుల మేడల్లోతప్ప పూరిగుడిశెల ఊసెత్తరు
కాళ్లుండీ కుంటివాళ్లు
మనుషుల బుజాల్ని తప్ప యింకేమీ ఎక్కరు
కాషాయాంబరాలు మానరు
ఆధ్యాత్మిక చింత పేర
నవీన పతివ్రతల్ని పావనం చెయ్యందే వదలరు
ఎవరయ్యా ఎవరీ రసరాట్టులు
బతుకంతా మోసంతో గతికి గతికి
జనాన్నీ జాతి నరనరాన్నీ మతమౌఢ్యానికి తీర్చితీర్చి
వయసులో నానాపాయసాలూ మరిగి మరిగి
కొవ్వెక్కిన పిట్టగూళ్ళ తలబుట్టల బాబాలే
చక్రవర్తుల్లా ఊరేగే జగద్గురు సాముల్లారే
 కుష్ఠు వ్యవస్థకు మూలవిరాట్టులు
చీకటి బజారు జలగల్ని
రాజకీయ బొద్దింకల్ని
పదవీ మదాంధుల్ని
సాహిత్య వందిమాగధుల్ని
అభయహస్తంతో కాపాడే కంకణం కత్తుకున్నారు
నిర్వీర్యాన్ని దేశం నలుమూలలా
కాలవలనిండా పారిస్తున్నారు
భయంకర కుష్ఠు సంస్కృతిని దేశమంతా పంచుతున్నారు
నమ్మకు  మతాల సుఖరోగుల్ని
వర్ణాశ్రమధర్మ ద్వేషాలు రేపే అడ్డగాడిదల్ని
బహిరంగంగా సభల్లో వ్యభిచరించే ఆబోతుల్ని
రంకూ బొంకూ పురాణాల బంకును
వేదికలెక్కి కుక్కల్లా కక్కే వెధవల్ని
మన్నించకు
మనిషిని ఏనాడో మరచిపోయి
మంచితనాన్ని అంటరానితనంగా ఎంచే తుచ్ఛులకు
చిలకజోస్యాల పిలకగుళ్ళు
వంటింటి కుందేళ్ళు
పట్టెనామాల పొట్టేళ్ళు
బిళ్ళగోచీ బల్లులు
జందెంపోగుల పందులు
బ్రహ్మరథం పడుతుంటే
కళ్ళుండీ కంటూనే
చెవులు పోటెక్కేట్టు వింటూనే
కదలకుండా మౌనంగా నిలబడకు.
దేవుళ్ల దేవులాటలో
మహామహా మాయల నాయాళ్ళ సన్నాసుల
జోగుల మోజుల్లో
పడిపోయిన దేశాన్ని
భవిష్యత్కాలాన్ని
కాపాడడానికి నడుంకట్టు
పాతిపెట్టు
మైలురాయివేకాదు
మంచికి పతాకాన్నెత్తే మనిషినని
మరోసారి రుజువు చెయ్యి
* * * * *
28. ప్రపంచం నిండా
29. చరిత్ర ద్రోహం
30. వ్రణం
31. "దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ "
ప్రజా జీవనాడి స్పందన పసిగట్టలేని
సమన్వయ మేధావుల అంచనాల వంచనలో
నిలువల్లా మునిగిన దేశం
ప్రణాళికల తాటిచెట్ల నీడల్లో
పడిగాపులుగాచే ప్రజల దేశం
స్వదేశీమార్కు విదేశీయ మార్కెట్టు
మనస్తత్వపు మంది దేశం
కట్టుకో గుడ్డలేని దేశం
దేశి సరుకు ధాన్యానికైనా నోచుకోని దేశం
రెండు దశాబ్దాలు దాటినా
కోట్లాది ప్రజల నోటికందని దేశం
నాదేశం నా ప్రాణం అంటూ
గర్వించే రేబవళ్లు శ్రమించే
శ్రమజీవుల భవిష్యత్తు యావత్తూ
అప్పుల్లో కుక్కబడ్డ దేశం
పిడికెడు సుఖరోగుల చెప్పుచేతల్లో
పడిపోయిన ప్రజాస్వామ్య దేశం
చమటోడ్చి పాటుపడే శ్రమజీవికి
కడుపునిండ తిండెక్కడ కండెక్కడ
పెంచిన మంచి కొన్ని సంచుల్లోకెళ్ళుతోంది
తలపెట్టిన మేలుకు తలలే తాకట్టు పడ్డాయ్
డబ్బు తెచ్చే కీర్తిసంపదల
దోపిడి కిరీటాల తురాయీలొద్దు
కలహాల కారణాలు వెతకని
చరిత్ర పరిణామం యెరుగని ఘనులకు
కత్తివైరాన్ని నిరసించే హక్కు లేదు
ఒరుల మేలుకు సంతసించమనే
కుహనా ఆదర్శవాద ఐకమత్యాని కర్థం లేదు
వొట్టి కడుపులతో మలమల మాడే
అస్థిపంజరాల ఐకమత్యపు సత్యం వేరు
పరులెవరో
కలిమివాళ్ల కెక్కడిదో యోచించక
దు:ఖం అసూయ చిహ్నమనే
సామాన్యులు పాపులనే
సాహసాలు చాలు చాలు
చిక్కని పాలవంటి దేశాన్ని
కొల్లగొట్టే మేలి బతుగ్గాళ్ల మేలును
నా మేలని యెంచే నిర్వీర్యపు నేర్పరితనం
నా ఛాయలకే వద్దు
లాభాల్లో వాటాలు పెంచుకునే
వ్యాపారసరళి దేశభక్తి అక్కర్లేదు
శ్రమఫలితం కాజేసే
పొరుగువాడికి తోడు పడే
వర్గసామరస్య మార్గం వద్దు
మహోన్నత మానవత్వపు సూర్యోదయాన్ని
ఆదిలోనే అడ్డుకొనే
మానవ చరిత్రనిండా మారణహోమాలు రేపిన
మానవ చరిత్రనిండా మారణహోమాలు రేపిన
మానవ చరిత్రనిండా మారణహోమాలు రేపిన
మనిషి మనిషిని క్రూరంగా విడదీసిన
హేతురహిత అశాస్త్రీయ
జాతిమతాల్నొప్పుకునే
విషపానీయ సేవ్యం వద్దు 
అక్కడ అన్నదమ్ముల ప్రసక్తి వద్దు
సంఘానికి దూరంగా అణగిమణగి
వర్తమానం గుర్తించక
రుతుచక్రం మలుపుల్లో గొంతెత్తే
కోయిల కవితలొద్దు రచనలొద్దు
ఆస్తిహక్కు రక్షణకై తపనపడే
నక్కల తోడేళ్ల కెదురుతిరిగి
ప్రాణాలను మానాలను అర్పించే
హెచ్చు తగ్గులసలులేని
దేశభక్తి నిర్వచనం
రక్తతర్పణాలతో
రచిస్తోంది నా తరం
* * * * *

32. రాజధాని లేఖ
33. స్వీయచరిత్ర
34. మరోసారి ఈ దేశం మోసపోగూడదు
మరోసారి ఈ దేశం మోసపోగూడదు
బిర్లాభవనంలో వైభవంగా ప్రార్థనలు జరుపుకునే
హరేరాం బికారులు మళ్లీ పుట్టగూడదు
గీతాధ్యయన నేతలు ఈ జాతికి ఇంకా అక్కర్లేదు
బుద్ధుని యిమిటేషన్ ప్రబుద్ధుని సంతతి
పలికే ప్రగల్భాలతోనే
ఇరవై రెండేళ్లూ నీరుగారిపోయాయ్
శాంతిసహనాలతో ఇన్నాళ్లూ మిన్నకున్నందుకు
చరిత్రలో నా తరం చాలాచాలా పోగొట్టుకుంది
సామాన్యుడు సంఘబహిష్కృతుడిగా
సంక్షేమరాజ్యంలో రోజూ చస్తూనే వున్నాడు
పెంకుటిండ్లు పూరిండ్లై
పూరిండ్లు నేలమట్టమవుతుంటే
ఉన్నవాడు దేశాన్ని పిండిపిండి మరింత ఉన్నతంగా
ఆకాశాన్నందుకుంటున్నాడు
గ్రామాలు కుళ్ళి కుళ్ళి అజ్ఞాన తమస్సులో
కుళ్ళుచూళ్ళేనంత దుర్భర దారిద్ర్యంతో
పగిలి పగిలి ఏడుస్తున్నాయ్
ఇవాళ
శిష్యుల గొప్పతనంగురించి వివరంగా చెబితే
హంతకునిలా నేరస్థునిలా
తలవంచుకుని నించున్నాడు అస్థిపంజరాల బోనులో
అన్నార్తుల కన్నుల్లో ఆశాకిరణం ఎడారిదారిలా చీలిపోయింది
విశ్వాసపు గుడారాలెగి రెగిరి గాలిలో
ఏనాడో శిథిలమయ్యాయి
సహనం చచ్చిన కంకాళాలు కలిసికట్టుగా
గండ్రగొడ్డళ్ళతో ఈటెలతో ఈ చీకటి వృక్షాన్ని
పెల్లగించక తప్పదింక
అరచి అరచి ఇరవైరెండేళ్ల చరిత్ర అలసిపోయింది
అతడు పీడితుల మనిషికాడని చెప్పకనే చెబుతోంది
వర్గచైతన్యం గుండెలో మెత్తమెత్తగా బాకులుదూసి
పోరాటశక్తిని నాశనం చేసిన
పచ్చి సామరస్యవాది ప్రపంచానికిచ్చిందేమిటి?
అధికారానికి అంగరక్షకుడిలా
లంచగొండి ప్రభుత్వానికి కవచంగా
మనమధ్య మనుగడ సాగించడమేమిటి?
ఖద్దరు బట్ట తప్ప దేశానికి మిగిల్చిందేమిటి?
అమాయక ప్రజల భుజాలనెక్కి
భగవద్గీత పారాయణ అభయహస్తంతో
మతమౌఢ్యపు పిచ్చికుక్కలకి
ఎద్దుముఖం పెద్దపులులకి
దేశాన్ని బలియిచ్చినవాడికి
ఈ నేలమీద ఇంకా నామరూపాలుండడమేమిటి?
ప్రజాస్వామ్యపు బ్రోతల్ హౌసులో
ఈ రాజకీయాల రంకు కథలు
అతని బిక్షగాక మరేమిటి?
అతని పేరెత్తిన [లేక 'పేరెత్తని ' యా?] నాయకుడు ఏడి?
అతని విగ్రహం లేని వీధులు ఏవి?
ఈ అస్తవ్యస్తపు మస్తిష్కపు మహాత్ముడికి
ఆరాధనేమిటి ఆర్భాటాలేమిటి?
తారలేమిటి రాగాల భోగాలేమిటి?
పర్వతాలేమిటి? పూజామందిరాలేమిటి?
ఇదంతా మన అజ్ఞానానికి చిహ్నం కాదా!
అతని విగ్రహం లేని వీధులు ఏవి?
ఈ అస్తవ్యస్తపు మస్తిష్కపు మహాత్ముడికి
ఆరాధనేమిటి ఆర్భాటాలేమిటి?
తారలేమిటి రాగాల భోగాలేమిటి?
పర్వతాలేమిటి? పూజామందిరాలేమిటి?
ఇదంతా మన అజ్ఞానానికి చిహ్నం కాదా!
అతని విగ్రహం లేని వీధులు ఏవి?
ఈ అస్తవ్యస్తపు మస్తిష్కపు మహాత్ముడికి
ఆరాధనేమిటి ఆర్భాటాలేమిటి?
తారలేమిటి రాగాల భోగాలేమిటి?
పర్వతాలేమిటి? పూజామందిరాలేమిటి?
ఇదంతా మన అజ్ఞానానికి చిహ్నం కాదా!
సబర్మతీ ఆశ్రమవాసి
సన్యాసీ కాదు సంసారీ కాదు
విజ్ఞానదాత కాదు విద్యావేత్త కాదు
రాజకీయవేత్త కాదు రాజూ కాదు
వేదాంతి కాదు వెర్రివాడూ కాదు
ప్రజల్ని పట్టించుకున్నదీ లేదు పట్టించుకోనిదీ లేదు
అన్నీ తానేగా
తానే అన్నీగా పెరిగి
భ్రమల సాలెగూళ్ళలోకి నినాదాల గాలిలోకీ
పుక్కిటిపురాణాల ఆదిమసంస్కృతిలోకి మనుషుల్ని తోసి
నిజావగాహనలేని ప్రజాద్రోహిగా మోసం చేసి
దూదిపింజల్లాంటి సిద్ధాంతాలు వల్లించి
నా తరానికి సున్నాలు చుట్టి వెళ్ళిపోయాడు
మరోసారి ఈ దేశం మోసపోగూడదు
* * * * *
35. పీడితలోకం పిడికిలి బిగించి పిలుస్తోంది
36. యువతరానికి
37. దిక్‌సూచి
ప్రజారక్త వ్యాపారులు లిప్తపాటులో
మండి మసి అయిపోయే తరుణం ఇదే
పదవుల పోరాటపు
కుటిలనీతి మంతనాల మంత్రుల్నీ అంతరాత్మల్నీ
సజీవంగా స్మశానానికి పంపే సమయమూ ఇదే
డబ్బు రాజ్యాన్ని కూలద్రోసి
కోట్లాది ప్రజల కూడుగుడ్డకోసం
అడుగడుగునా అధికారపు నడ్డి విరగదన్నాల్సిందే
ఒకటికి పది సున్నాలు చేరుస్తూ
ఉన్నవాడు ఉన్నతుడై
సంఘానికి న్యాయాలయమై
సామాన్యుల శాసించే
ధర్మానికి తలవొగ్గక
ఆ వర్గపు కంచుకోట కొల్లగొట్టి
ప్రజాధనం అందరి కందుబాటులో ఉంచాల్సిందే
ఏ దేశపు సంపదైనా
పుట్టిన పుట్టబోయే బిడ్డల జన్మహక్కుగా
సమ సమానంగా వితరణ చెందాల్సిందే
ఒక్కొక్కడూ ఒక్కో మృగరాజై
నక్కల తోడేళ్ళ డొక్కలు చీల్చి రక్తంలో
త్రివర్ణపతాకం ఆసాంతం ముంచి రంగు మార్చాల్సిందే
* * *
[దిక్‌సూచి, చెరబండరాజు, ప్రథమ ముద్రణ, అక్టోబరు 1970,
  హైదరాబాదు నుండి]

చెరబండరాజు కవితలు పాటలు


శివసాగర్ కవిత్వం 


    భావోద్వేగాలు హృదయాన్ని తాకి అనుభూతి చెంది తనదైన ముద్ర వేసుకుని పొంగి పొరలే వేళ వెలువడే భావాలే కవిత్వ రూపం దాల్చుతాయని నేననుకుంటాను. శివసాగర్ కవిత్వం ఆయన వ్రాసిన 1968 నుండి 2008 వరకు సాగిన కవితల కూర్పు, విప్లవాత్మకంగా సాగుతుంది. విప్లవంలో ప్రభవించి విప్లవంలో పయనిస్తూ దానితోనే కలిసి కొనసాగిపోతుంటుంది.తాను విప్లవంనుంచి విరమించుకున్నాక కూడా అధిపత్యాల ద్రోహాలనూ స్వార్ధాలనూ చెండాడుతూనే వుంది.కాస్త వ్యంగ్యం హాస్యం హేళనలను కలగలిపి, ఆసలు విప్లవమంటే రాచరికపు వ్యవస్థలు, పెద్ద పెద్ద భూస్వాములూ, బలవంతులూ తమ తమ స్వార్ధంతో పేదలను, కనీసావసరాలకు కూడా నోచుకోని బలహీన వర్గాలను దోచుకోవటం, వారిని అక్రమ శిక్షలకు గురికావించటం. తరతరాలుగా సాగుతున్న ఈ అన్యాయాన్ని పీడిత ప్రజలు మేలుకొని చైతన్యం పొందినవారై ధిక్కరించటమే ఈ విప్లవ మార్గం, విప్లవం.

    ఈ విషయాన్ని గ్రహించి ఆకలినీ అన్యాయాన్నీ ఎదిరించి, సమానత్వం సాధించటం కోసం చేసే ప్రయత్నంలో, తోటివారినికూడా భాగస్వాముల్ని చేస్తూ, ప్రభోదిస్తూ, ఉత్తేజపరుస్తూన్న పంధాలో వీరి కవితలు ఊపిరి పోసుకుంటాయి. ఈ కవిత్వం విప్లవాన్ని ప్రేరేపిస్తూ, విప్లవంలో భాగమౌతుంది. ఆ వ్యక్తి కూడా మహోజ్వల విప్లవమై భాసిస్తాడు. విప్లవమే తానై అంతర్భాగమై ప్రేరణ కల్పిస్తూ పిలుపునిస్తాడు. మన రక్తం తాగి ప్రాణాలను పీలుస్తున్న దోపిడీదారులను హతమార్చగ తరలి రమ్మని జేగంటలతో పిలుపు నిస్తాడు.

    హింసకు ప్రతిహింసే మార్గమని, ప్రతిహింసనే ఆయుధంగా చేసుకుని ప్రతిఘటనలతో విజయం సాధించాలనే నిర్ణయం కొంత నష్టాన్ని కలిగిస్తున్నా అవతలి వర్గంవారు కూడా అనుభవిస్తేగానీ వారికి తెలిసి రాదనే విషయం, ఆయుధాలు పట్టడానికీ, ఈ హింసా మార్గాన్నెంచుకోడానికీ కారణమౌతాయి. ప్రపంచమంతా చెలరేగుతున్న ఈ అన్యాయాన్ని ఐకమత్యంతోనే సాధించగలమని తెలియజేస్తాడు. కొన్ని పదాలకు తను స్వంతగా అర్ధాలను కల్పించుకుని తన కవితలతో విప్లవాన్ని, తన కవితలలో ప్రకృతితోనూ, సముద్రంతోనూ కలిపి రూపు కట్టిస్తాడు. ప్రజల్ని జాగృతి చేయడమే కాక సామాన్య జన బలగంతో జగతిని కంపింపజేసి తమ లక్ష్యం సాధించుకోవాలనీ చెప్తాడు. కొన్ని వేళల ఈ పోరాటమే తానౌతాడు.

    అసలే అది ఆవేశం. పోరాటం సుదీర్ఘ కాలం దాస్యంలో దౌష్ట్యంలో మగ్గి జాగృతి పొంది కట్టలు తెంచుకున్న ఆవేశం. అన్యాయాన్ని అరికట్టే ఆరాటం. భావంయొక్క బలానికి పదాలు కూర్చి చక్కగా కుదిరి కవిత జీవం పోసుకున్నట్లు ఉంటుంది. దానికి తోడు తనకు తానుగా కొత్త అర్ధాలతో ఏర్పాటు చేసుకున్న పదాలు కవితకు కొత్త శోభనీ అందాన్నీ సమకూరుస్తాయి. ఆలలు, కలలు సితారా సంగీతం లాంటివి.కొన్ని కవితలు లయాత్మంగా సాగి మనసులను ఇట్టే ఆకట్టుకుంటాయి. ఈ కవి విప్లవమే తానుగా మారినవాడు కావటం చేత కవితలు తీక్షణతనూ పదునునూ చిక్కించుకున్నాయి కొన్ని.

    పోరాటదారులకు అడవి ఆశ్రయమిస్తుంది. చెట్టూ పిట్టలూ కొండలూ గుట్టలూ వీరిని ఆహ్లాదపరుస్తూ సాయపడుతూ నేస్తాలవుతాయి. ఇక్కడ ప్రకృతి ఈయన కవితాహృదయాన్ని తాకి పరవసిస్తుంది. సామాన్యుణ్ణి అసమాన్యునిగా చూపెడుతూ నరుడో భాస్కరుడా పాట సాగుతుంది. భాస్కరరావనే వీరుడు మరణించినపుడు చెట్లనీ గుట్టలనీ గుర్తు చేసుకుంటూ ప్రకృతి సహచర్యాన్ని చెప్తాడు.

    కొన్ని నిజమైన సత్యాలను గుర్తించడం వివేకాన్ని తెలియజేస్తుంది. సత్యం చావదు. అది అజేయం. బాధలో దుఃఖంలో కూడా ఆశను ప్రజ్వలనం చేసుకోవడమే ఈయన ధ్యేయం.

    పోరాటంలో ఒక్కోసారి గాయాలూ బాధలూ అలసటలూ. కాస్త విశ్రాంతి కావాలి, సేద తీరాలి. ఆన్న, పాన, ఆధరువులూ కావాలి. అలాటప్పుడు మాతృహృదయ దర్శనం చేయిస్తాడు. అడవి తల్లి ప్రేమ మూర్తి. ఆర్తితో అందరికీ ఓదార్పునిచ్చి తన చల్లని ఒడిలో తావిచ్చి ఆకలి దప్పులు తీరుస్తుంది. కొన్ని పదాల్ని, కొంత శైలినీ, ఊళ్ళలో నివసించినపుడు జానపద గీతాల్నుండి గ్రహిస్తాడు. వాళ్ళ గుండె చప్పుళ్ళకు దగ్గరగా కొన్ని కవితలు రూపు కట్టాయి. చెల్లీ చంద్రమ్మ అనే కవితలో విప్లవపు రూపాన్ని చిత్రం కట్టినట్టు చూపెడతాడు.నిరామయమైన లోకం, బాధ, దుఃఖం, కొపం, పగ, ద్వేషంగా మారి తీవ్రమైన ఆవేశం ముంచుకురాగా ప్రతీకారం చేయడం ఇక్కడ కనిపిస్తుంది. తన విశాల తత్వాన్ని శక్తి సామర్ధ్యాలనీ మరింతగా పెంపొందించుకున్న వైనాన్ని నెలబాలుడు లో చూస్తాం.

    ఉద్యమంతోపాటుగా కవితలు కూడా మారుతూ కొంత కొత్తదనాన్ని నింపుకుంటాయి. 74లో రెడ్ సిగ్నల్ దగ్గరకొచ్చేసరికి ఈ మార్పు ప్రభుత్వ వ్యతిరేకతను తీవ్రంగా వ్యక్తపరుస్తుంది.
అప్పటికి ఈ వ్యతిరేకత railway సమ్మె రూపంలో నగరాలకీ పాకింది. ఇక్కడ మాటలే అస్త్రాలు.

    కొంత హాస్యం మరికొంత వ్యంగ్యంగా “ఇందిరిస్టు గారడీ” సాగుతుంది. “కంసుని కంప్యూటర్” లో వ్యంగ్యం చోటు చేసుకుంటుంది. ఇది విప్లవాల కాలమని చెప్తూ “ఋతుగీత”. ఇలా కాలంతో పాటు కదలిపోతూ ఎప్పటికప్పుడు ఏర్పడుతూన్న పరిస్థితులలోనుండి వస్తువును స్వీకరిస్తూ కవితలు సాగుతాయి. “గురజాడ” సజీవ స్వతంత్ర పాత్రలుకూడా కాలానుగుణంగా మార్పులు చెందినట్లు మలచిన తీరు ప్రతిభావంతమై నిలిచింది.

    తనను కన్నందుకు కన్నతల్లికే ప్రేరణనిచ్చిన విప్లవ చైతన్య స్పూర్తికే విప్లవాభివందనాలర్పిస్తారు. జాఫ్నాలో చనిపోయిన సిపాయితో నిజాల్ని పరికిస్తాడు. ఓ కొడుకుని పోగొట్టుకున్న దళితుని ఆవేదన తెలియజేస్తూ పొంగారిన హృదయదఃఖభాండాన్ని గ్రుమ్మరించాడు.

    ప్రకృతిలోని సాదృశ్యాలను చూపెడుతూ అమరత్వం రమణీయమైనదైనదనీ కాలాన్ని కౌగలించుకుని మరో సంతోషప్రదమైన కొత్త లోకాన్నిస్తుందని తెలియజెస్తారు. తన భావాలూ ఆశలూ ఆశయాలూ కలకాలం నిలిచివుంటాయనీ, వీటిని మరే నిజమైన శక్తి జయించలేదనీ, తాను మృత్యుంజయుణ్ణనీ, “ ఎదురు చూడు నాకోసం” లో చెప్తున్నారు. శారీరక అస్వస్థత దరిజేరినా అంతరంగం మాత్రం ఇంకా వల విసిరి కలల్ని పట్టుకోగలిగిన ఉత్సాహంలోనే ఉన్నదని సైనికుడూ రణరంగమూ కూడా తానే ఐనట్లుగా భావిస్తూ ఇంకా పోరాటభావాలు తనను వీడలేదని తెలియజేస్తారు.

    ఈ విధంగా స్వచ్చమైన మనస్సుతో శక్తివంతమైన భావాన్ని జతకూర్చి అనుభూతి చెందిన కవితలలో పరిణత సిద్ధించుకున్న ప్రజ్ఞాశాలి శివసాగర్..

    మానవజాతి మనుగడకు స్వాభావికమైన విపత్తులెన్నో…వరదలు, అనావృష్టి, కరువు కాటకాలు, భూకంపాలులాంటివి. ఇలాంటివి తలెత్తినపుడు ప్రజల ప్రాణ ధనాలకు నష్టమేకాక బ్రతుకు దుర్భరమౌతుంది. అలా కాక కేవలం మనిషిలో తలెత్తిన స్వార్ధంతో అహంకారంతో ఎదుటివారిని మోసం చేయటం వారి శ్రమ శక్తిని దోచుకుని వారిని హింసకు గురి చేయటం క్షమార్హం కాని నేరాలు.

రాసి పంపిన వారు: కొత్త ఝాన్సీలక్ష్మి
[2009 మార్చ్ 15 వ తేదీన DTLC (Detroit Telugu Literary Club, USA) 
లో శివసాగర్ కవిత్వం మీద జరిగిన చర్చ సందర్భంగా రాసిన సమీక్ష]

********************************************************************
పుస్తకం వివరాలు:
రచయిత: శివసాగర్
వెల: 100 రూపాయలు
కాపీలు: తెలుబు బుక్ హౌస్, నవోదయ – హైదరాబాద్ శాఖల్లో లభించును

ఈ వ్యాసం కాపీరైట్లు DTLC వారివి.
*********************************************************************



సిటీ లైఫ్’ నేపథ్యం 


    గుండె నిండా బాధ కళ్ల నిండా నీళ్లున్నప్పుడు మాట పెగలదు. కొంత సమయం కావాలి. దట్టంగా కమ్ముకున్న విషాద మేఘాలు చెల్లాచెదురై హృదయం నిర్మలాకాశం కావడానికి కొంత వ్యవధి కావాలి. భారమవుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్యే మృత్యువును పరిహసించేందుకు ఒకింత సాహసం కావాలి. ఉండీ ఉండీ ఉధృతమయ్యేందుకు ఉద్వేగభరితమైన సన్నివేశం కావాలి…

    సరళమైన భాష నుంచి సంక్లిష్టమైన వ్యాకరణంలోకి ప్రవేశించినట్టు, కలల వంతెన కూలి కన్నీటి నదిలోకి దూకినట్టు హైదరాబాదనే మానవారణ్యంలోకి అడుగిడి సరిగ్గా ఇప్పటికి పది సంవత్సరాలు.

    కుంచె నుంచి ప్రవహించే చైతన్యం ఘనీభవించి, కెమెరా ముందు సృజనాత్మకత ఒక అపరిపక్వ స్వప్నంగానే చితికిపోయి, నానాటికీ దారిద్య్రమనే ఊబిలోకి దిగబడి బహుశా ఏ పౌరుడూ పాత్రికేయుడూ పడనన్ని కష్టాలతో చితికి… చితికి… చివరికి ‘సిటీ లైఫ్‌’ పారితోషికమే జీవనాధారంగా స్వీకరిస్తున్న నేపథ్యంలో హృదయం విప్పి నన్నీ నాలుగు మాటలు చెప్పుకోనివ్వండి.

    ఒకప్పుడు పచ్చపచ్చగా బతికినవాణ్ని ఇప్పుడు పత్రహరితం కోల్పోయిన పిచ్చి మొక్కలా… అస్థిపంజరంలా… అసంపూర్తి వాక్యంలా తయారవ్వడానికి గల అనేకానేక కారణాల్లో ఒక నయవంచకుడు నాకు తలపెట్టిన ద్రోహాన్ని కూడా చేర్చవచ్చు. అయితే ఇప్పుడా వివరాలన్నీ తవ్వుకోవడం సముచితం కాదుగానీ… క్రమేణా కంప్యూటర్ల సుడిగుండంలో పడి చిక్కి మునిగిపోయే ముందు విద్యానగర్‌ బస్టాప్‌ పక్కన మెయిన్‌ రోడ్‌లో ‘చిత్రలేఖ’ పేరున నాకో చిన్న స్టూడియో ఉండి ఉండేది. మనిషి బతికుండగానే గుండెల్లో స్ట్రా గుచ్చి రక్తం పీల్చే ఈ రాక్షస వ్యవస్థలో అతికష్టంగా ఆరు సంవత్సరాలు ఆ స్టూడియోను నడిపిన పర్యవసానానికి దాదాపు నలబై వేల రూపాయల విలువకట్టగల నా చెమట నా యజమానైన ఒకానొక మార్వాడీ గాడి జేబులోకి ఇంకిపోయిందే తప్ప నాకు లాభించిందేమీ లేదు. పైగా అన్నమాట ప్రకారం అప్పులు చెల్లించేందుకు కరీంనగర్‌లో కన్నతండ్రి కట్టించిన ఇల్లు అమ్ముకోవాల్సిన అగత్యం ఏర్పడింది.

    మధ్యతరగతి కౌగిట్లో మాధుర్యం కూడా తరిగిపోయి పరిపరి విధాల మానసిక వేదనతో పాటు పెరిగే ఇద్దరు పిల్లల భారాన్ని మోయటమెలాగనే ఆరాటం.

    మందులు కొనుక్కోలేని నిర్భాగ్యపు నగరంలో మళ్లీ మళ్లీ ఊపిరితిత్తుల్లో క్షయ రాజుకోవటం పరిపాటయి పోయింది. పుట్టిన గడ్డ నుంచి ఇక్కడికి రావటమే పొరపాటయి పోయింది.

    వాస్తవానికి` అవసరానికి నన్ను వినియోగించుకున్న వాళ్లే నాపై జాలీ నోటులా జాలి కురిపించి కుళ్లిన ఆసుపత్రిలా పక్కనజేరి పరామర్శించినా నా నించి ఏమీ ఆశించని వాళ్లే నాకెంతగానో సహకరించారు. ‘ఐసోనెక్స్‌’ నుంచి ‘సైక్లో సెరిన్‌’ వరకూ ఉచితంగా మందులందించిన మహానుభావులెందరో ఉన్నారు.

    ముఖ్యంగా ఇటీవలి కాలంలో వి.వి., ఎ.ఎన్‌., నిఖిలేశ్వర్‌, నిమ్స్‌ మధు, వెంకట్‌, చక్రపాణి, గచ్చు మీద పచ్చనోటులా మోగే నిజాం వెంకటేశం, గంగారెడ్డి మొదలుకొని గద్దర్‌, కాళోజీల వరకూ, మా తమ్ముడు దయాకర్‌, దయామయుడు డాక్టర్‌ పి.పి.ఆర్‌. భాస్కర్‌రావు, డాక్టర్‌ రవీంద్రారెడ్డి, డాక్టర్‌ వెంకటేశ్వరరెడ్డి (సాయిరాం నర్సింగ్‌హోం), డాక్టర్‌ రామచంద్రారెడ్డి (సంఘం నర్సింగ్‌ హోం), డాక్టర్‌ విజయకుమార్‌, ప్రొఫెసర్‌ వేణు, ఆయుర్వేద వైద్యులు ప్రధ్యుమ్నాచార్య నీలంగేకర్‌, రాధాకృష్ణమూర్తి ఇంకా ఎందరో మృత్యువు బారి నుంచి నన్నెప్పటికప్పుడు సంరక్షిస్తూ వస్తున్నారు. ఆక్స్‌ఫర్డు గ్రామర్‌ స్కూల్‌ అధినేత వేదకుమార్‌ మామీద చిలకరించే సానుభూతి జల్లులే మా పిల్లల చదువై కొనసాగుతుంది.

    అయితే నాలోని అరాచకం, వేళకి మందులు వాడని క్రమశిక్షణా రాహిత్యం వల్ల రాను రాను నా శరీరంలోని రోగనిరోధక శక్తి సన్నగిల్లి ఆరునెలల్లో అవలీలగా నయం చేసుకోగలిగిన వ్యాధి పదేళ్లు అంచెలంచెలుగా ముదిరి నా రెండు ఊపిరితిత్తుల్నీ పాడుచేసింది. దశలవారీగా 45, 60, 90, 120 ఇలా వందలాది స్ట్రెప్టోమైసిన్‌, క్యానమైసిన్‌ ఇంజక్షన్‌లు నా ఒంటిమీద స్వైరవిహారం చేసిన ఫలితంగా వ్యాధి సంగతటుంచి భయంకరమైన సైడ్‌ ఎఫెక్ట్స్‌ ప్రారంభమై ఆపాదమస్తకం నా దేహమే ఒక ఆసుపత్రి రోదనగా మారిపోయింది.

    మరీ సందర్భంగా ఖరాఖండిగా ఓ నిజం చెప్పాల్సేవుంది. ఎడతెరిపిలేని దగ్గు, అడుగు కదపనివ్వని ఆయాసం, రక్తం ముద్దలుగా పడుతున్న రోజుల్లో కూడా నేను కవిత్వాన్ని నిర్లక్ష్యం చేయలేదు. నాలోని విలువల్ని భగ్నం చేసుకోలేదు. నా ప్రాపంచిక దృక్పథాన్ని వీడి ఏ ప్రలోభాలకు లోబడలేదు. ఆఖరికి కాలి ధూళితో సమానమైన కలర్‌ సినిమా గ్లామర్‌ను సైతం నా కళ్లల్లో పడకుండా జాగ్రత్తపడ్డానే తప్ప ఎటువంటి కుళ్లు మార్గాలకు తలవొగ్గలేదు. మనోహరాకాశంలో ఎగిరే కొంగ మొదలుకుని మదరాసులోని కొంగర జగ్గయ్య వరకూ నా కవిత్వాన్ని అమితంగా ప్రేమిస్తారని తెలుసు.

    అలిశెట్టి ప్రభాకర్‌కు పాత చెత్త కవుల్లాగా శాలువాలు కప్పించుకోవాల్సిన అవసరమెప్పుడూ కలగదనే ఆత్మవిశ్వాసం కలిగిన ఎమ్వీయల్‌ ఆనాడే ఆంధ్రదేశపు అనేకానేక సభల్లో నన్నూ, నా కవిత్వాన్నీ పలవరించి, పలవరించి పదైదులు నిండకుండానే ఈ ప్రపంచాన్ని విస్కీ సీసాలా తన్నేసి వెళ్లిపోయాడనీ తెలుసు. అయినా నేనేనాడూ పొగడ్తలను పోషక పదార్థాలుగా స్వీకరించి ఉబ్బి తబ్బివ్వలేదు. సగం సగం కమ్యూనిస్టుల సాహవాస దోషం లేకున్నా సహపంక్తి భోజనాల్లో కూర్చున్నట్లే కూర్చొని ఒకర్నొకరు అనుమానాస్పదంగా చూసుకొనే సాహిత్య సభల్లోకి తరచూ వెళ్లకున్నా అడపా దడపా జననాట్య మండలి గుండె చప్పుడు వినో అరుదుగా కదిలే జన మైదానాలను కనో ప్రతిస్పందించే నాకు మెజార్టీ ప్రజల బాధలూ గాధలే ముడిసరుకయ్యాయి.

    చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగిన వాణ్ని, ఆకుపచ్చని చెట్టు, ఆహ్లాదభరితమైన వాతావరణమేమీ లేకుండానే పగలూ రాత్రీ యాస్బెస్టాస్‌ రేకుల కింద ఎంత వేడెక్కినా మాడిపోకుండా ఉండగలిగిన మానవాతీతుణ్ని. నరకప్రాయమైన నగర నాగరికతకు నరనరానా జీర్ణించుకున్నవాణ్ని. రోజుకో రెండు కవితా వాక్యాలు రాయలేనా… అది మనకు పెన్నుతో పెట్టిన విద్య… అఫ్‌కోర్స్‌ కవిత్వం ఎంత నిత్యనూతనంగా వెలికి వచ్చినా రాసిన ప్రతిది ఆణిముత్యం కాదని అందరికి తెలుసు. కవిత్వమే పాత్రికేయ వృత్తిలో అంతర్భాగమైన ఈ రోజుల్లో ‘న్యూస్‌ ప్రింట్‌’ మీద రోజూ నా పేరు అచ్చు కావడం పెద్ద విశేషమూ కాదు.

    ‘ఆంధ్రజ్యోతి’ హైదరాబాద్‌ ఎడిషన్‌ వెలువడుతున్న సందర్భంగా ఆప్యాయంగా నన్ను పిలిచి ఈ శీర్షిక ‘సిటీ లైఫ్‌’నప్పగించింది ఎ.బి.కె. ప్రసాద్‌ గారే అయినా ఆనాటి నుంచి ఆరేళ్లుగా, ధారావాహికంగా ప్రచురించబడటానికి సౌమ్యులూ, సౌహార్ధ్ర హృదయులైన మా నండూరి రామమోహనరావు గారు, ఎం.డి.జగదీష్‌ ప్రసాద్‌, ఆంక్షలేవీ విధించని ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్‌ బోర్డే కారణం. ముఖ్యంగా నగరం పొలిమేరలు దాటని ఈ శీర్షికను తెలంగాణ జిల్లాలకు విస్తరింపచేసిన ఐ.వెంకట్రావు గారు అభినందనీయులు. అంతేకాదు నెలకు ఏ ఒకటి, రెండుసార్లో ఆఫీసుకెళ్ళినా మురళి, శ్రీనివాస్‌, గుడిపాటి, రవికిషోర్‌ ఎవరెదురైనా ‘‘అన్నా! ఆరోగ్యం బావుందా?’’ అని ప్రేమతో పలకరించి అరకప్పు ‘టీ’ తాగించే సబ్‌ఎడిటర్‌ మిత్రులూ, సంధ్యా సమయాన టెలిప్రింటర్ల మీద వార్తలు నెత్తురోడుతున్న సందట్లో సైతం ‘సిటీ లైఫ్‌’ను ఫోనులో చెప్పినా చక్కగా రిసీవ్‌ చేసుకునే ఆంజనేయులు, చిన్ని రామకృష్ణ, ఇంకా నర్సిమ్‌, భూషణ్‌, లే అవుట్‌ ఆర్టిస్టులు.

    సమయానికి ప్రెస్‌కందించే జైహింద్‌, జనసత్యం లాంటి తమ్ముళ్ల సహకారముండబట్టే నా అనారోగ్యం కూడా అడ్డంకి కాకుండా ‘సిటీ లైఫ్‌’ ఇలా నిర్నిరోధంగా సాగిపోతుంది. సిటీ లైఫే నా సమగ్ర కవితా స్వరూపానికి కొలబద్దా కాదు. సుదీర్ఘ కవితా ప్రకంపనా కాదు… కానీ ధ్వంసమై పోతున్న సమస్త మానవ విలువల్నీ, హింసా రాజకీయాల్నీ నిరసించటంతో పాటు నిప్పు కణికల్లాంటి, కన్నీటి గుళికల్లాంటి చిన్న చిన్న కవితలెన్నో ప్రతిరోజూ ‘ఆంధ్రజ్యోతి’ పాఠకులకందించగలుగుతున్నాను.

    రోజుకో మందు బృందంలో పాల్గొని పలుచబడిపోతున్న సాహిత్య భ్రష్టుల కోసమో, అవార్డుల కోసం క్యూలో నిలబడే అర్భకుల కోసమో, ఇస్త్రీ నలక్కుండా విప్లవ సందేశాల్ని అందించే మేధావుల కోసమో, కవిత్వంలోనూ జీవితంలోనూ ద్వంద్వ ప్రమాణాలనవలంబించే దౌర్భాగ్యుల కోసమో కాక, సామాన్య పాఠకుడి కోసమే ఈ సిటీ లైఫ్‌ని ప్రచురించటానికి పూనుకున్నామని చెప్పొచ్చు.

    సామాజిక స్పృహ కలిగిన రచనల సరసన చేర్చిన ఈ ‘సిటీ లైఫ్‌’ ముద్రణకు తెలుగు విశ్వవిద్యాలయం తరఫున ‘సినారే’నే దీనికి మొదట శ్రీకారం చుట్టినా ఈ ప్రచురణా కార్యక్రమం మొదలైనప్పటి నుంచీ మూడుసార్లు ఆస్పత్రిలో చేరి డిశ్చార్చి కావటం. అరవై బొమ్మల కోసం అతి సన్నిహితుడైన నర్సిమ్‌ చుట్టూ ఆరు నెలలు ప్రదక్షిణ చేయాల్సి రావటం, బ్రోమైడ్‌లు అనుకున్న విధంగా రాకపోవటం, లై అవుట్‌ ఆర్టిస్టులైన నారాయణ, శ్రీనివాసులు చెరో గంట పనిచేసి చెప్పాపెట్టకుండా పారిపోవటం… ఇటువంటి చిన్నా పెద్దా సమస్యలెన్నో ఎదుర్కొన్నా వాటినధిగమించడానికి తోడ్పడిన మిత్రులు రాధాంజనేయ స్వామి (యు.ఎస్‌.జి.సి), ఉదయ భాస్కర్‌, జయధీర్‌, తిరుమలరావు, రాజమౌళి, పెన్మెత్స రాజు, మాధవి, కవిత్వం విషయంలో ప్రత్యేకాభిమానం చూపించే పద్మజా విద్యాసాగర్‌లు, పవన్‌, ఆనంద్‌, ప్రవీణ్‌లు, కవితాత్మీయులు స్మైల్‌, ఆర్కె, నవీన్‌, మల్లారెడ్డి, నాగేశ్వర్‌రావులు, నరేష్‌, హరీష్‌ విజన్‌ గ్రాఫిక్స్‌ మిత్రులు ఆనంద భాస్కర్‌ మరియు శ్రీనివాస్‌, ప్రెస్‌ కార్మికులకు హృదయపూర్వకాభివందనాలు తెలుపుతూ అతి సమయమనంగా వ్యవహరించి ముద్రించగలిగినప్పటికీ ఎంతో కొత్త అసంతృప్తి నాలాంటి వాడికి మిగిలిపోతూనే వుంటుంది. ఏమైనప్పటికీ అలల హోరులా అంతరంతరాల్లో రగులుతున్న ఈ సిటీ లైఫ్‌ నేపథ్యాన్ని ఇంతటితో ముగిస్తూ ఈ చిన్ని కవితా ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ…

ప్రేమతో
మీ అలిశెట్టి ప్రభాకర్‌
4 జులై 1992
(‘సిటీ లైఫ్’ కవితా సంకలనం ముందుమాట నుంచి…)
పుట్టింది కరీంనగర్ జిల్లా, జగిత్యాల. కవి, చిత్రకారుడు. ఫొటో గ్రాఫర్. విరసం సభ్యుడు. జగిత్యాల జైత్రయాత్ర వెల్లువలో విప్లవోద్యమాన్ని ప్రేమించాడు. 1979లో విప్లవ రచయితల సంఘంలో సభ్యుడయ్యాడు. అద్భుతమైన సాహితీ సృజనచేసి, తెలుగు సాహిత్యంపై చెరగని ముద్రవేశాడు. రచనలు : ఎర్ర పావురాలు (1977), మంటల జెండాలు (1979), చురకలు (1981), రక్త రేఖ (1985), సంక్షోభ గీతం (1990), సిటీ లైఫ్ (1992), మరణం నా చివరి చరణం కాదు. తీవ్ర అనారోగ్యంతో 1993 జనవరి 12న చనిపోయాడు.
*********************************************************

అలిశెట్టి ప్రభాకర్ కవితలు

కొలిమి
ప్రత్యామ్నాయ కళా సాహిత్య సాంస్కృతిక వేదిక

మొఘల్‌ సామ్రాజ్యం



మొఘల్‌ సామ్రాజ్యం స్థాపించింది -బాబర్‌
ఇతని అసలు పేరు -జహీరుద్దీన్‌ మొహ్మద్‌ బాబర్‌
టర్కీ అమిర్‌ల ప్రకారం బాబర్‌ అనగా సింహం
ఇతని తండ్రి - మీర్జా ఉమర్‌
మీర్జా ఉమర్‌ ఆఫ్ఘనిస్థాన్‌ -ఉబ్జెకిస్తాన్‌లో  ఫర్ఘాన పాలకుడు.
ఫర్ఘాన రాజధాని - ఆండీజన్‌
బాబర్‌ తండ్రి తరపున తైమూర్‌ ఇలాంగ్‌ వంశానికి చెందినవాడు.
బాబర్‌ తల్లి తరపున చెంఘీజ్‌ఖాన్‌ వంశానికి చెందినవాడు. 
బాబర్‌ చాగ్‌తాయి తెగకు చెందినవాడు
బాబర్‌ 11 సం॥ల వయస్సులో ఉమర్‌ మీర్బా మరణానంతరం పర్ఘాన పాలకుడయ్యాడు.
బాబర్‌ తన మామ కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొనిచివరకు కాబూల్‌లో స్థిరపడ్డాడు.
బాబర్‌ మొట్టమొదటిసారిగా 1519లో ఇండియాపై దాడి చేశాడు.
బాబర్‌ ఈ మొదటి దాడిలో వాయువ్య భారత్‌లో భీరా ప్రాంతంపై దాడి చేశాడు.
బాబర్‌ భీరా వద్ద మొట్టమొదటిసారిగా గన్‌పౌడర్‌ ఉపయోగించాడు.
బాబర్‌ యొక్క 5వ దాడిలో పానిపట్టు యుద్ధం జరిగింది.
బాబర్‌ భారతదేశంపై దాడి చేస్తున్నప్పుడు భారతదేశంలో పాలకులు
పంజాబ్‌ - దౌలత్‌ఖాన్‌ లోడీ
ఢిల్లీ - ఇబ్రహీం లోడీ (పినతండ్రి ఆలంఖాన్‌ లోడి)
మాళ్వా - మొహమ్మద్‌-2 (ప్రధాని-మేథినీరాయ్‌-2)
మేవార్‌ - రాణా సంగా
గుజరాత్‌ - మజఫర్‌షా
బెంగాల్‌ - నుస్రత్‌ షా
దక్షిణ భారతదేశం- శ్రీకృష్ణ దేవరాయలు 

బాబర్ ‌(1526-30):
founder of Mughal Dynasty,Mughal Dynasty founder,introduction to Mughal Dynasty in telugu,Mughal Dynasty introduction in telugu,history of Mughal Dynasty in telugu,Mughal Dynasty history in telugu,history of babar Mughal Dynasty in telugu,history of delhi sultanate in telugu,delhi sultanate in telugu,tspsc group2 indian history in telugu,indian history Mughal Dynasty in telugu,Mughal Dynasty notes in telugu,Mughal Dynasty study material in telugu,delhi sultanate notes in telugu,delhi sultanate study material in telugu,list of kings of Mughal Dynasty,Mughal Dynasty kings,Mughal Dynasty empire,list of kings of delhi sultanate in telugu,Mughal empire kings,Mughal Dynasty upsc,Mughal Dynasty tspsc,kings of Mughal Dynasty,babar mughal,babur mughal history,babar mughal invasion,babar empire expansion,babar wife name,babar mughal,Babur's First Indian Expedition,Battle of Bajaur babar,founder of the mughal empire,The Age of the Mughalsm,Biography of Babur,the first mughal emperor,First Battle of Panipat 1526,rule of Babur in India,THE MEMOIRS OF BABUR,Tomb of the Mughal Emperor Babar,Babar's Invasion,How did Babur become the ruler of Delhi,India on the eve of Babur's invasion 1525,babar mughal first name,Invasion of Mughals in India,Babar the Conqueror Facts,Mughal Emperor Babur history,The Establishment of the Mughal Empire,Great dynasties of the world,
రాణాసంగ్రామ్‌సింగ్‌, ఆలంఖాన్‌ లోడి అభ్యర్థన మేరకు 5వ సారి దాడి చేశాడు.
1526(ఏప్రిల్‌ 21) - మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్‌ ఇబ్రహీంభాన్‌ లోడీని ఓడించి ఢిల్లీలో మొఘలుల పాలనను స్థాపించాడు.
ఈ యుద్ధంలో ఇబ్రహీంకు సహకరించింది-రాజా విక్రమ్‌జిత్‌ (గ్వాలియర్‌ పాలకుడు)
ఈ యుధ్ధంలో బాబర్‌ రూమి(గొయ్యి), తులుగుమ(అశ్వక దళం) అనే యుద్ధ తంత్రాలను ఉపయోగించాడు.
1527 - కాణ్వా యుద్ధంలో మేవార్‌ పాలకుడు రాణా సంగ్రామ్‌సింగ్‌ను ఓడించాడు. ఈ యుద్ధంలో బాబర్‌ రాణా సంగాపై జిహాద్‌ ప్రకటించాడు. ఈ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత బాబర్‌ గాజీ బిరుదు పొందాడు. ముస్లింలపై “టంగా'(స్టాంప్‌ డ్యూటీ) అనే పన్ను రద్దు చేశాడు. ఈ యుద్ధ విజయం భారత్‌లో బాబర్‌ స్థానం సుస్థిరం చేసింది. ఈ యుద్ధం మొదటి పానిపట్‌ యుద్ధం కన్నా ముఖ్యమైనది. 
రాణా సంగా బిరుదులు : 1) మాన్‌ ఆఫ్‌ హండ్రెడ్‌ బ్యాటిల్స్‌ 2) ఫ్రాంగ్మెంటెడ్‌ సోల్డర్‌ 
రాణా సంగా యొక్క తాత రాణా కుంభా(1433-68). చిత్తోడ్‌లో కీర్తిస్తంభాను
నిర్మించాడు.
1528 - చందేరీ యుద్ధంలో మాళ్వా పాలకుడు మేధినీరాయ్‌ను ఓడించి, చందేరీ కోటను, మాళ్వాను ఆక్రమించాడు.
1529 - గోగ్రా యుద్ధంలో నుస్రత్‌ షా, మొహ్మద్‌ షా అనే ఆష్టనులను ఓడించి బెంగాల్‌ను ఆక్రమించాడు.
1530 - బాబర్‌ మరణించాడు. (ఇతను మరణం గురించి గుల్‌బదన్‌ బేగం తన హుమయూన్‌ నామా పుస్తకంలో పేర్కొంది)
బాబర్‌ తన ఆత్మకథ బాబర్‌నామాను టర్కీ భాషలో రచించాడు. దీన్నే తజుక్‌-ఇ-బాబరి అని కూడా అంటారు
అందువల్లనే బాబర్‌ను స్వీయ చరిత్రల రారాజు అంటారు.
అతని యొక్క అమీరులు అతనికి, బాబర్‌(సింహం లేక పులి) అనే బిరుదు ఇచ్చారు. బాబర్‌ తన స్వీయగ్రంథమైన తజుక్‌-ఇ-బాబరిలో హిందుస్థాన్‌ జనంతో నిండిన విశేషమైన ఉత్పత్తి కలిగిన చాలా విశాలమైన దేశం అని “అద్భుత దేశంగా వర్ణించాడు.
ఇతను మస్నవీ అనే పుస్తకం కూడా రచించాడు.
బాబర్‌ కాలంలో కాశ్మీర్  పాలకుడైన మీర్జా హైదర్‌ తారిక్‌-ఇ-రషీదీ అనే పుస్తకాన్ని రచించాడు.
ముల్లా షరఫ్‌ జాఫర్‌నామాను రచించాడు.

హుమయూన్‌(1530-40, 1555-56):
founder of Mughal Dynasty,Mughal Dynasty founder,introduction to Mughal Dynasty in telugu,Mughal Dynasty introduction in telugu,history of Mughal Dynasty in telugu,Mughal Dynasty history in telugu,history of babar Mughal Dynasty in telugu,history of delhi sultanate in telugu,delhi sultanate in telugu,tspsc group2 indian history in telugu,indian history Mughal Dynasty in telugu,Mughal Dynasty notes in telugu,Mughal Dynasty study material in telugu,delhi sultanate notes in telugu,delhi sultanate study material in telugu,list of kings of Mughal Dynasty,Mughal Dynasty kings,Mughal Dynasty empire,list of kings of delhi sultanate in telugu,Mughal empire kings,Mughal Dynasty upsc,Mughal Dynasty tspsc,kings of Mughal Dynasty,humayun mughal dynasty,humayun history in telugu,humayun babar story in telugu,humayun father name,Humayun Biography,Biography of Humayun,The Mughals Humayun,List of battles fought by emperor Humayun,humayun battles list,Humayun's Conquest,Invasion of Chittor by Bahadur Shah of Gujrat,Humayun- Early Expeditions,humayun wife name,humayun sons,
హుమయూన్‌ అనగా అదృష్టవంతుడు
1530 - డిసెంబర్‌ 29న హుమయూన్‌ మొఘల్‌ చక్రవర్తిగా పట్టాభిషేకం చేశాడు. 
1532 - దౌరాయుద్ధంలో మహమ్మద్‌ లోడిని ఓడించాడు.
1535‌ - మాండాసోర్‌ యుద్ధంలో గుజరాత్‌ పాలకుడు బహదూర్‌ షాను ఓడించాడు.
1537 - చునార్‌ యుద్ధంలో షేర్షాను ఓడించి బెంగాల్‌లో గౌడ ప్రాంతం వరకు దండయాత్ర కొనసాగించాడు. - గౌడ్‌లో కొన్ని నెలలపాటు విలాసవంతమైన జీవితం గడుపుతూ దానికి జన్నతాబాద్‌(స్వర్ణాల నగరం) అని పేరు పెట్టాడు.
ఈ మధ్య కాలంలో ఆగ్రాలో హుమయూన్‌ సోదరుడు హిందాల్‌ తానే మొగల్‌ చక్రవర్తినని ప్రకటించుకున్నాడు.
1539 - చౌసా యుధ్ధంలో షేర్షా హుమయూన్‌ను ఓడించాడు. హుమయూన్‌ తన ప్రాణాలను రక్షించుకొనుటకు కర్మనాసా నదిలో దూకాడు. అతని జనరల్‌ నిజాం షా హుమయూన్‌ ప్రాణాలు కాపాడాడు.
1540 - బిలగ్రామ్ /కనాజ్‌ యుద్భంలో షేర్షా హుమయూన్‌ను పూర్తిగా ఓడించాడు. దీంతో హుమయూన్‌ తన రాజ్యం కోల్పోయి. మధ్య భారతదేశ అడవులకు చేరాడు.
1541 - మధ్య భారతదేశ అడవులలో హమీద(భాను)బేగంను వివాహం చేసుకున్నాడు.
1542 - రాజస్థాన్‌-సింధ్‌లోని అమర్‌కోట్‌ (ప్రస్తుతం  పాకిస్తాన్‌ సింధ్‌లోని ఉమర్‌కోట్)‌ పాలకుడు రాజా వీర్‌సల్‌/రాణాప్రసాద్‌ ఆస్థానంలో హుమయూన్‌, హమీదాబాను బేగంకు అక్బర్‌ జన్మించాడు. (అక్చర్‌ను మహామంగ పెంచింది)
1545-హుమయాూన్‌, భానుబేగం పర్షియా చేరుకున్నారు. అప్పటి పర్షియా పాలకుడు షాథామాప్స్‌ (సఫావిద్‌ వంశం) సహాయాన్ని హుమయూన్‌ అర్థించాడు. షాదా మాస్స్‌ 'కాందహారొను గెలిచిన తర్వాత దానిని తనకు అప్పగించాలనే షరతుతో ఆశ్రయం ఇచ్చాడు.
1553 - పర్షియా సహాయంతో హుమయూన్‌ కాబూల్‌ పాలకుడు కమ్రాన్‌ను ఓడించి అతన్ని గుడ్డివాణ్ణి చేశాడు. ఇక్కడే హుమయూన్‌ తను పోగొట్టుకున్న అక్చర్‌ను మరలా కలిశాడు. అక్బర్‌ను పంజాబ్‌కు పాలకుడిని చేసి బైరంఖాన్‌ను అతనికి సంరక్షకుడిగా నియమించాడు.
1555 - మచ్చివార, సర్‌హింద్‌ యుద్దాలలో సికిందర్‌ సూర్‌ను ఓడించి మరలా ఢిల్లీపై మొఘలుల పాలనను స్థాపించాడు.
1556 - దీన్‌పన్హాలో తన వ్యక్తిగత గ్రంథాలయం షేర్‌మండల్‌లో మెట్ల పైనుండి జారిపడి ప్రమాదవశాత్తు మరణించాడు.
హుమయూన్‌ ఢిల్లీలో దిన్‌పన్హాను నిర్మించాడు.
హుమయూన్‌ తులాభారంను ప్రవేశపెట్టాడు
హుమయూన్‌ దస్తాన్‌-ఇ-అమీర్‌వాంజా అనే పెయింటింగ్‌ వేయించాడు.
హుమయూన్‌కు పరమ శత్రువు హుమయూనే. అతనికి గల నల్లమందు తినే వ్యసనం కొంతవరకు అతని పతనానికి కారణంగా చెప్పవచ్చు.
ఇతని మరణానంతరం హేమూ ఢిల్లీని ఆక్రమించి కొన్ని రోజులపాటు పాలించాడు.
హేమూ ఢిల్లీకి చివరి హిందూ పాలకుడు
బెంగాల్‌ పాలకుడు ఆలీ అదిల్‌షా హేమూకు విక్రమజిత్‌ అనే బిరుదును ఇచ్చాడు.
హుమయూన్‌ సమాధిని అతని భార్య హాజీ బేగం/ హమిదాభాను బేగం ఢిల్లీలో నిర్మించింది.

founder of Mughal Dynasty,Mughal Dynasty founder,introduction to Mughal Dynasty in telugu,Mughal Dynasty introduction in telugu,history of Mughal Dynasty in telugu,Mughal Dynasty history in telugu,history of babar Mughal Dynasty in telugu,history of delhi sultanate in telugu,delhi sultanate in telugu,tspsc group2 indian history in telugu,indian history Mughal Dynasty in telugu,Mughal Dynasty notes in telugu,Mughal Dynasty study material in telugu,delhi sultanate notes in telugu,delhi sultanate study material in telugu,list of kings of Mughal Dynasty,Mughal Dynasty kings,Mughal Dynasty empire,list of kings of delhi sultanate in telugu,Mughal empire kings,Mughal Dynasty upsc,Mughal Dynasty tspsc,kings of Mughal Dynasty,humayun mughal dynasty,humayun history in telugu,humayun babar story in telugu,humayun father name,Humayun Biography,Biography of Humayun,The Mughals Humayun,List of battles fought by emperor Humayun,humayun battles list,Humayun's Conquest,Invasion of Chittor by Bahadur Shah of Gujrat,Humayun- Early Expeditions,humayun wife name,humayun sons,

మొట్టమొదటిసారిగా ఈ సమాధి నిర్మాణంలో పాలరాయి ఉపయోగించారు. దీని ఆధారంగానే తాజ్‌మహల్‌ నిర్మించబడింది.

సూర్‌ వంశం(1510-55):

1) షేర్షా(1540-45):
founder of Mughal Dynasty,Mughal Dynasty founder,introduction to Mughal Dynasty in telugu,Mughal Dynasty introduction in telugu,history of Mughal Dynasty in telugu,Mughal Dynasty history in telugu,history of babar Mughal Dynasty in telugu,history of delhi sultanate in telugu,delhi sultanate in telugu,tspsc group2 indian history in telugu,indian history Mughal Dynasty in telugu,Mughal Dynasty notes in telugu,Mughal Dynasty study material in telugu,delhi sultanate notes in telugu,delhi sultanate study material in telugu,list of kings of Mughal Dynasty,Mughal Dynasty kings,Mughal Dynasty empire,list of kings of delhi sultanate in telugu,Mughal empire kings,Mughal Dynasty upsc,Mughal Dynasty tspsc,kings of Mughal Dynasty,shershaah history,mughal empire sher shah,Sher Shah Suri dynasty,Sher Shah Suri born,history of Sher Shah Suri in telugu,Sher Shah Suri history in telugu,Sher Shah Suri battles,Sher Shah Suri victories in telugu,Sher Shah Suri invasion,Sher Shah Suri battles list,Sher Shah Suri original name,Sher Shah Suri career,the great Sher Shah Suri history in telugu,indian history Sher Shah Suri,Sher Shah Suri ruled,The Sur Empire founder,founder of The Sur Empire,
సూర్‌ వంశాన్ని స్థాపించినవాడు - షేర్షా 
ఇతని అసలు పేరు ఫరీద్‌
ఇతను ఆస్టనిస్థాన్‌కు చెందినవాడు. ఇతని తండ్రి ఒక రెవెన్యూ అధికారి
ఇతను జౌన్‌పూర్‌లో సంస్కృతం, పర్షియా భాషలను నేర్చుకున్నాడు.
బీహార్‌ పాలకుడు బహర్‌ఖాన్‌ లోహనీ వద్ద ఒక టీచర్‌గా పనిచేశాడు.
తర్వాత రెవెన్యూ శాఖలో డిప్యూటీ వకీల్‌దార్‌గా పని చేశాడు.
బహర్‌ఖాన్‌ లోహనీ ఫరీద్‌కు 'షేర్‌ఖాన్‌' అనే బిరుదు ఇచ్చాడు.

1530 - చునార్‌ పాలకుడు మరణంతో అతని వితంతువు లాడ్‌మాలికను వివాహం చేసుకొని చూనార్‌ పాలకుడయ్యాడు.
1533 - తన బద్ద శత్రువు నుస్రత్‌షాను సూరజ్‌ఘర్‌ యుద్ధంలో ఓడించాడు. ఇతను నుస్రత్‌షాపై జిహాద్‌ ప్రకటించాడు.
1537 - చునార్‌ యుద్ధంలో హుమాయున్‌చే ఓడించబద్దాడు.
1539 - చౌసా యుద్ధంలో హుమయూన్‌ను ఓడించాడు.
1540 - బిల్‌గ్రామ్‌/కనౌజ్‌ యుద్ధంలో హుమయూన్‌ను ఓడించి షేర్షా బిరుదు పొంది ఢిల్లీ పాలకుడయ్యాడు.
1545 - కలింజర్‌ కోటను అక్రమిస్తున్నప్పుడు గన్‌పౌడర్‌ పేలుడులో ప్రమాదవశాత్తు మరణించాడు. (అప్పటి కలింజర్‌ రాజు కిరాత్‌సింగ్‌)
షేర్షా తన 5 సం॥ల పరిపాలనా కాలంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. క్షేత్ర స్థాయిలో ఉన్న ఉద్యోగులపై ప్రధానంగా తన దృష్టిని సారించాడు.
గ్రామాలలో శాంతి పరిరక్షణ కొరకై ముకద్దమ్‌ అనే పోలీసు అధికారి ఉండేవాడు.
గ్రామాలలో జరిగే నేరాలకు ముకద్దమ్‌లను బాధ్యులను చేసేవాడు.
బదిలీల విధానంను ప్రవేశపెట్టాడు. ఉన్నత అధికారులను ప్రతీ 2 సం॥లకు ఒకసారి బదిలీ చేసేవాడు.
ఇతను భూమిని 3 రకాలుగా విభజించాడు.
1) ఉత్తమం
2) మధ్యమం
3) అధమం
రెవెన్యూ వసూళ్లలో 3 పద్ధతులను అవలంభించాడు.
1) గల్లాబక్షి - పంట ఆధారంగా శిస్తు వసూలు జరిగేది
2) నస్క్/‌కంకుట్‌ - భూమి సారవంతం ఆధారంగా శిస్తు వసూలు జరిగేది
3) జప్తి - ఒప్పందం ఆధారంగా శిస్తు వసూలు జరిగేది
భూమిని కొలుచుటకు సికిందర్‌-ఇ-గజ్‌ను ఉపయోగించాడు. ఈ కొలత కొరకు జరీబ్‌ అనే కర్రను ఉపయోగించాడు.
రైతులకు పట్టాలు ఇచ్చి వారి వద్ద నుండి కుబిలియాత్‌ పత్రం తీసుకొనేవాడు.
నిర్మాణాలు:
పురానా ఖిలా (ఓల్డ్‌ ఫోర్ట్‌) ఢిల్లీ
ససారామ్‌ (షేర్షా సమాధి) బీహార్‌
founder of Mughal Dynasty,Mughal Dynasty founder,introduction to Mughal Dynasty in telugu,Mughal Dynasty introduction in telugu,history of Mughal Dynasty in telugu,Mughal Dynasty history in telugu,history of babar Mughal Dynasty in telugu,history of delhi sultanate in telugu,delhi sultanate in telugu,tspsc group2 indian history in telugu,indian history Mughal Dynasty in telugu,Mughal Dynasty notes in telugu,Mughal Dynasty study material in telugu,delhi sultanate notes in telugu,delhi sultanate study material in telugu,list of kings of Mughal Dynasty,Mughal Dynasty kings,Mughal Dynasty empire,list of kings of delhi sultanate in telugu,Mughal empire kings,Mughal Dynasty upsc,Mughal Dynasty tspsc,kings of Mughal Dynasty,shershaah history,mughal empire sher shah,Sher Shah Suri dynasty,Sher Shah Suri born,history of Sher Shah Suri in telugu,Sher Shah Suri history in telugu,Sher Shah Suri battles,Sher Shah Suri victories in telugu,Sher Shah Suri invasion,Sher Shah Suri battles list,Sher Shah Suri original name,Sher Shah Suri career,the great Sher Shah Suri history in telugu,indian history Sher Shah Suri,Sher Shah Suri ruled,The Sur Empire founder,founder of The Sur Empire,
గ్రాండ్‌ ట్రంక్‌ రోడ్‌ - బెంగాల్‌లో సోనార్గాం నుండి పాక్‌లో అటోక్‌ వరకు వేయించాడు.
రహదారులు - ఆగ్రా-మండ, ఆగ్రా-జోద్‌పూర్‌, ఆగ్రా-చితోర్‌
షేర్షా వెండి రూపాయి నాణెములను, రాగి దమ్‌ నాణెములను ప్రవేశపెట్టాడు.
ఇతని కాలంలో బంగారు నాణెము లను అష్రఫీ అనేవారు.
ఇతని కాలంలో ఆస్థాన చరిత్రకారుడు అబ్బాస్‌ షేర్వాణీ తాజూక్‌-ఇ-షేర్షాహీ అనే పుస్తకం రాశాడు.
ఇతని ఆస్థాన కవి మాలిక్‌ మొహ్మద్‌ జైసీ పద్మావతి పుస్తకం రచించాడు.
ఇతని రెవెన్యూ మంత్రి రాజా తోడర్‌మల్‌
షేర్షా తర్వాత సూర్‌ పాలకులు ఇస్తాం షా, సికిందర్‌ సూర్‌
ఇస్లాం షా “జలాల్‌ఖాన్‌” అనే బిరుదు పొందాడు.

అక్బర్‌ (1556-1605): 

founder of Mughal Dynasty,Mughal Dynasty founder,introduction to Mughal Dynasty in telugu,Mughal Dynasty introduction in telugu,history of Mughal Dynasty in telugu,Mughal Dynasty history in telugu,history of babar Mughal Dynasty in telugu,history of delhi sultanate in telugu,delhi sultanate in telugu,tspsc group2 indian history in telugu,indian history Mughal Dynasty in telugu,Mughal Dynasty notes in telugu,Mughal Dynasty study material in telugu,delhi sultanate notes in telugu,delhi sultanate study material in telugu,list of kings of Mughal Dynasty,Mughal Dynasty kings,Mughal Dynasty empire,list of kings of delhi sultanate in telugu,Mughal empire kings,Mughal Dynasty upsc,Mughal Dynasty tspsc,kings of Mughal Dynasty,mughal akbar,akbar history,history of mughal akbar,mughal akbar invasion,mughal akbar battles list,list of battles of mughal akbar,the great empire of mughal dynasty,great empire of delhi sultanate,mughal akbar wife's names,mughal akbar step mother name,mughal akbar family,Akbar the Great Biography,Biography of Akbar the Great,the Mughal Dynasty - Akbar the Great,
ఇతని అసలు పేరు జలాలుద్దీన్‌ మహమ్మద్‌
అక్బర్‌ సంరక్షకుడు ఖైరాంఖాన్‌ 
అక్బర్‌ గురువు -అబ్దుల్ లతీఫ్‌ (ఇతను అక్బర్‌కు సులేకుల్‌/సర్వ మానవ సౌ(భ్రాతృత్వంను/ విశ్వ శాంతిని బోధించాడు). 
అక్బర్‌ భార్యలు - 1) రుకయా సుల్తానా బేగం 2) సల్మా సుల్తానా బేగం (బైరాంఖాన్‌ భార్య) 3) హర్మాబాయ్‌ (జోధాబాయ్‌)
జోదాభాయ్‌ బిరుదు - మరియం ఉస్‌ జమానీ
అక్టర్‌ పెంప్రడు తల్లి-మహంమంగ (కుమారుడు ఆదంఖాన్‌)
అక్బర్‌కు పాలిచ్చిన తల్లి - జీజీ అంగ (భర్త అతాగాఖాన్‌)
1556 ఫిబ్రవరి 14న కలనౌర్‌లో పట్టాభిషేకం చేసినపుడు అతని వయస్సు 14 ఏళ్లు.
1556 - 2వ పానిపట్టు యుద్ధంలో ఖైరాంభాన్‌ హేమూను వధించిన తర్వాత అక్బర్ మొఘల్‌ చక్రవర్తి అయ్యాడు. ఈ సందర్భంగా అక్బర్‌ బైరాంఖాన్‌కు ఘాజీఅనే బిరుదు ఇచ్చాడు. అక్బర్‌ పట్టాభిషేకం పంజాబ్‌లో కలనౌర్‌లో జరిగింది.
1560 - బైరాంఖాన్‌ తిరుగుబాటు చేశాడు. కానీ అతను అణిచివేయబడి మక్కాకు పంపబడ్డాడు. కానీ మార్గమధ్యంలో గుజరాత్‌-సింధ్‌ వద్ద బైరాంఖాన్‌ఒక హాన్‌ అయిన హాజీఖాన్‌ మేవాతిచే హత్యకు గురయ్యాడు.
1562 - బానిసత్వంను రద్దు చేశాడు
1563 - తీర్ధయాత్రలపై పన్నును రద్దు చేశాడు
1564 - జిజియా అనే మత పన్ను రద్దు చేశాడు
1571 - రాజధానిని ఆగ్రా నుండి ఫతేపూర్‌ సిక్రీకి మార్చాడు.
1575 - ఇబాదత్‌ ఖానా అనే ప్రార్ధనా మందిరం నిర్మించాడు.
1576 - హల్టీఘాట్‌ యుద్ధంలో అక్బర్‌ మన్సబ్‌దార్‌ మాన్‌సింగ్‌ మేవాడ్‌ పాలకుడైన రాణా ప్రతాప్‌ సింగ్‌ను ఓడించాడు.
1579 - గుజరాత్‌పై విజయానికి గుర్తింపుగా ఫతేపూర్‌ సిక్రీలో బులంద్‌ దర్వాజను నిర్మించాడు. 
1581 - ఇబాదత్‌ఖానాలో మత చర్చలు అంతమయ్యాయి.
1582 - దీన్‌-ఇ-ఇలాహి /తొహిద్‌-ఇ-ఇలాహిను తన వ్యక్తిగత మతంగా ప్రకటించాడు. (షేక్‌ ముబారక్‌ యొక్క మఝర్‌ ఆధారంగా)
1601 - అక్బర్‌ చివరి ఆక్రమణ ఆసిర్‌ఘడ్‌ కోట
1605 -అక్బర్‌ మరణం

అక్బర్‌ ఆస్థానంలో ప్రముఖులు:
అబుల్‌ ఫజల్‌ : ఆస్థాన కవి, అక్చర్‌నామ/ ఐనీ అక్బరీని రచించాడు.
అబుల్‌ ఫైజీ : అబుల్‌ ఫజల్‌ సోదరుడు. భగవద్గీతను పర్షియాలోకి అనువాదించాడు.
ఐదౌనీ : ఆస్థాన చరిత్రకారుడు. ముక్తకా-ఉల్‌-తవారిక్‌ని రచించాడు.
తోడర్‌మల్‌ : రెవెన్యూ మంత్రి. ఇతని సలహా మేరకు అక్బర్ ఐనీదాసలా/బందోబస్తు విధానంను ప్రవేశపెట్టాడు. ఈ విధానం ప్రకారం ఒక ప్రాంతం యొక్కశిస్తు ఆ ప్రాంతంలో గత 10 సం॥ల్లో పండిన పంట, వాటి ధర ఆధారంగా నిర్ణయిస్తారు.
తాన్‌సేన్‌ - ఇతను ఆస్థాన సంగీతకారుడు. ఇతను గ్వాలియర్‌కు చెందినవాడు. ఇతను మేగ్‌, హిండోల్‌, రాగదీపిక
రాగాలు రచించాడు.
founder of Mughal Dynasty,Mughal Dynasty founder,introduction to Mughal Dynasty in telugu,Mughal Dynasty introduction in telugu,history of Mughal Dynasty in telugu,Mughal Dynasty history in telugu,history of babar Mughal Dynasty in telugu,history of delhi sultanate in telugu,delhi sultanate in telugu,tspsc group2 indian history in telugu,indian history Mughal Dynasty in telugu,Mughal Dynasty notes in telugu,Mughal Dynasty study material in telugu,delhi sultanate notes in telugu,delhi sultanate study material in telugu,list of kings of Mughal Dynasty,Mughal Dynasty kings,Mughal Dynasty empire,list of kings of delhi sultanate in telugu,Mughal empire kings,Mughal Dynasty upsc,Mughal Dynasty tspsc,kings of Mughal Dynasty,mughal akbar,akbar history,history of mughal akbar,mughal akbar invasion,mughal akbar battles list,list of battles of mughal akbar,the great empire of mughal dynasty,great empire of delhi sultanate,mughal akbar wife's names,mughal akbar step mother name,mughal akbar family,Akbar the Great Biography,Biography of Akbar the Great,the Mughal Dynasty - Akbar the Great,
బీర్బల్ : ఇతను ఆస్థాన విదూషకుడు (వాస్యకారుడు) . ఇతని అసలు పేరు మహేష్‌దాస్‌. ఇతను మన్సబ్‌దార్‌ కాదు. అక్బర్‌ యొక్కదిన్‌-ఇ-ఇలాహిలో చేరిన మొదటి వ్యక్తి. ఇతను కైబర్‌ కనుమ వద్ద చంపబడ్డాడు.
భగవాన్‌దాస్‌, మాన్‌సింగ్‌ : వీరిద్దరూ ఉన్నత మన్ఫబ్‌దార్లు 
అబ్దుల్  రహీం ఖాన్‌-ఇ-ఖానా : భైరాంఖాన్‌ కుమారుడు. ఇతను జహంగీర్‌ గురువు. బాబర్‌ నామాను టర్కీ భాష
నుండి పర్షియాలోకి అనువదించాడు. (బాబర్‌ నామను మొదటిగా జైన్‌ఖాన్‌ పర్షియాలోకి అనువదించాడు)
ఖ్వాజా అబ్దుల్  సమద్‌- చిత్రకారుడు. ఇతని కలం పేరు -షరీన్‌ కలమ్‌ (తియ్యని కలం), లిఖితకారుడు. ఇతని కలం పేరు -జరీమ్‌ కలమ్‌ (బంగారు కలం)
అక్బర్‌ మన్సబ్‌దారీ విధానం:
ఇది మొఘలుల మిలిటరీ వ్యవస్థ. దీనిని 1570లో అక్బర్‌ ప్రవేశపెట్టాడు. మూడు తరహా మన్సబ్‌దార్లు ఉండేవారు
1) మన్సబ్‌దార్‌ : 500 కంటే తక్కువ సైనికులకు అధిపతి
2) అమీర్‌ : 500-2500 మంది సైనికులకు అధిపతి
3) అమీర్‌-ఇ-ఆజమ్‌ : 2500 కంటే ఎక్కువ మంది సైనికులకు అధిపతి
అశ్వక దళంలో 3 రకాల అధిపతులు ఉండేవారు.
1) సే ఆస్పా - 3 గుర్రాలు ఉంటాయి
2)దో ఆస్పా - 2 గుర్రాలు ఉంటాయి
3) నీమ్‌ సవార్‌ - 1 గుర్రం ఉంటుంది
అక్బర్‌ కాలంలో అత్యధిక మన్సబ్‌దార్‌ ర్యాంక్‌ -7000. 
7000 ర్యాంక్‌ పొందిన ఇద్దరు మన్సబ్‌దార్లు - మాన్‌సింగ్‌, మీర్జా అజీజ్‌ కోకా
దీన్‌-ఇ-ఇలాహి:
ఈ మతం ప్రకారం ప్రతి ఉదయం చక్రవర్తి సూర్యున్ని పూజించేవాడు.
తన రాజోద్యోగులలో మాన్‌నింగ్' ఈ మతాన్ని అనుసరించడానికి నిరాకరించాడు.
అక్బర్‌ తన గురువు అబ్దుల్  లతీఫ్‌ బోధించిన సులేకుల్‌ ఆధారంగా దీన్‌-ఇ-ఇలాహిని ప్రకటించాడు.
ఈ మతాన్ని ప్రకటించక ముందు అక్బర్‌ ఇబాదత్‌ ఖానాలో మత చర్చలు నిర్వహించాడు.
ఈ మత చర్చల్లో పాల్గొన్నవారు
1) హిందూ మతం - పురుషోత్తమ్‌, దేవి
2) క్రిస్టియానిటీ - అక్వావిరా, మాన్సరేట్‌
3) జైన మతం - హేరవిజయ సూరి (జగద్గురు, యుగప్రదాన్‌)
4) జొరాస్ట్రియన్‌ -నవసారి మహారాజు రాణా
అక్బర్‌ దీన్‌-ఇ-ఇలాపా ప్రకటించిన తర్వాత ఇన్సాన్‌-ఇ-కమీన్‌ అనీ బిరుదు పొందాడు.
అక్బర్‌ మత విషయాల్లో చక్రవర్తిని సర్వాధికారిని చేస్తూ అమోఘత్వ ప్రకటన జారీ చేశాడు.
నిర్మాణాలు:
1) ఆగ్రాకోట:
దీని ఆర్కిటెక్ట్‌ -ఖాసిం
ఇది భారత్‌లో అతి పటిష్టమైన కోట
దీనిని రాజపుత్రులు కోటల ఆధారంగా నిర్మించాడు. దీని లోపల ముఖ్య కట్టడాలు
1) అక్చరీ మహల్‌
2) జహంగరీ మహల్‌
3) ముసామమ్‌ బురుజు .
4) అమరసింహ ద్వారం.

2) ఫతేపూర్‌ సిక్రీ:
దీని ఆర్కిటెక్ట్‌ -బహవుద్దీన్‌
ఫతేపూర్‌ సిక్రీలో జామా మసీదు అద్భుతమైన కట్టడం. ఆగ్రాకు దగ్గరలో ఉంది
దీనిలో ముఖ్య కట్టడాలు
1) బులంద్‌ దర్వాజ ను
2) ఇబాదత్‌ ఖానా (ఇక్కడే సలీంచిస్థీ సమాధి ఉంది)
3) పంచ్‌ మహల్‌ (బౌద్ధ మత ప్రభావం దీనిపై ఉంది)
4) జోదాబాయి ప్యాలెస్‌
5) బీర్బల్‌ భవంతి
6) టర్కీ సుల్తానా ప్యాలెస్‌
సాంఘిక సంస్కరణలు:
హిందువుల తిరునాళ్లు, ఉత్సవాలలో అక్బర్‌ స్వయంగా పాల్గొన్నాడు.
బాల్య వివాహాలు, చిన్న పిల్లలను చంపటం(బలి) నిషేధించబడ్డాయి.
హిందూ వితంతు పునర్వివాహం చట్టబద్ధం చేయబడింది.
సతీ సహగమన నిషేధాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాడు
కొన్ని నిర్జీత దినాలలో జంతువధ నిషేధించబడింది.
అక్బర్‌ స్వయంగా అక్షరజ్ఞానం కలవాడు కాకపోయినా ఫతేపూర్‌ సిక్రీలో ఆడపిల్లలకు పాఠశాలలను స్థాపించాడు.
షేక్‌ సలీం చిస్థీ ఆశీర్వాదంతో అక్బర్‌, మరియమ్‌కు జన్మించిన బిడ్డకు సలీమ్‌ అని పేరు పెట్టినప్పటికినీ అక్బర్‌ ప్రేమగా ఆ బిడ్డను “షేక్‌బాబా' అని పిలుచుకునేవాడు.

జహంగీర్‌ (1605-27) 

founder of Mughal Dynasty,Mughal Dynasty founder,introduction to Mughal Dynasty in telugu,Mughal Dynasty introduction in telugu,history of Mughal Dynasty in telugu,Mughal Dynasty history in telugu,history of babar Mughal Dynasty in telugu,history of delhi sultanate in telugu,delhi sultanate in telugu,tspsc group2 indian history in telugu,indian history Mughal Dynasty in telugu,Mughal Dynasty notes in telugu,Mughal Dynasty study material in telugu,delhi sultanate notes in telugu,delhi sultanate study material in telugu,list of kings of Mughal Dynasty,Mughal Dynasty kings,Mughal Dynasty empire,list of kings of delhi sultanate in telugu,Mughal empire kings,Mughal Dynasty upsc,Mughal Dynasty tspsc,kings of Mughal Dynasty,mughal dynasty jahangir,mughal dynasty jahangir  history in telugu,history of mughal dynasty jahangir,mughal dynasty jahangir wife name,mughal empire jahangir history in telugu,mughal empire jahangir invasion,mughal empire jahangir battles list,
తల్లి పేరు హీరాకున్వారి లేదా మరియమ్‌-ఉజ్‌ -జమాని/ జోదా (అమీర్‌పాలకుడు రాజా బారామల్‌ కుమార్తె,
 భగవాన్‌ దాస్‌ సోదరి).
1605 - నూరుద్దీన్‌ మహమ్మద్‌, సలీం జహంగీర్‌ (విశ్వాన్ని జయించాడు) అనే బిరుదు పొంది మొఘల్‌ 
చక్రవర్తి అయ్యాడు. అదే సం1॥లో 12 ఇస్లామిక్‌ చట్టాలను ప్రకటించాడు.
1606 - జహంగిర్‌పై తిరుగుబాటు చేసిన అతని పెద్ద కుమారుడు ఖుస్రూ మీర్జాకు అర్జున్‌దేవ్‌ సహకరించాడు. 
దీనితో సిక్కుల 5వ గురువు అర్జున్‌దేవ్‌ ఉరి తీయబడ్డాడు.

1608 - ఈస్ట్‌ ఇండియా కంపెనీ రాయబారి హాకిన్స్‌ జహంగీర్‌ ఆస్థానంను సందర్శించాడు.
1611 - నూర్జహాన్‌ను వివాహమాడాడు
1614 - మేవాడ్‌ అమరసింహను ఓడించాడు
1615 - బ్రిటీష్‌ రాయబారి సర్‌ థామస్‌రో ఇతని ఆస్థానంను సందర్శించాడు.
1626 - జహంగీర్‌ జనరల్‌ మహబత్‌ఖాన్‌ తిరుగుబాటు చేసి జహంగీర్‌ను బంధించాడు. 
ఈ సమయంలో నూర్జహాన్‌ కీలక పాత్ర పోషించి జహంగీర్‌ను విడిపించి మహబత్‌ఖాన్‌ను అణిచివేసింది.
1627 - జహంగీర్‌ మరణించాడు
జహంగీర్‌ కాలంలో చిత్రలేఖనం అత్యధికంగా అభివృద్ధి చెందింది.
ఇతని కాలంలో 'మసిసుర్‌” మినియేచర్‌ పెయింటింగ్‌లో ప్రసిద్ధి చెందినవాడు.
ఉస్తాద్‌ మన్సూర్‌ జంతు చిత్రలేఖనంలో ప్రసిద్ధి చెందినవాడు.
బిషన్‌దాస్‌ -పోలికల పెయింటింగ్‌కు ప్రసిద్ధి (మాస్టర్‌ ఆఫ్‌ టైట్స్‌)
జహంగీర్‌ చివరి రోజుల్లో ఉబ్బసపు వ్యాధితో బాధపడ్డాడు
జహంగీర్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి. అతనికి భాషలలో, చరిత్రలో, భూగోళశాస్త్రంలో, చిత్రలేఖనంలో, 
సంగీతంలో, వాస్తు, తోటపనిలో ఆసక్తి కలవు.
జహంగీర్‌ సౌందర్యాధికుడు. అతనికి పాటలంటే ఇష్టం. అతడు శ్రీనగర్‌ వద్దగల షాలిమార్‌, 
నిషాత్‌ తోటలను ఏర్పరిచాడు.

భారతదేశంలో అక్బర్‌ కాలంలో పొగాకు ప్రవేశపెడితే, జహంగీర్‌ కాలంలో పొగాకు నిషేధించబడింది.
జహంగీర్‌ తన స్వీయ చరిత్ర జహంగీర్‌ నామాను రచించాడు. ఈ రచన ప్రకృతిపై అతనికి గల
 గాఢమైన అభిమానాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.
జహంగీర్‌ అబుల్‌ ఫజల్‌ను హత్య గావించాడు. ఇతను సింహాసనం అధిష్టించేనాటికి ఇతనికి 36 ఏళ్లు.
జహంగీర్‌ 12 శాసనాలు ప్రవేశపెట్టాడు. వాటిలో ముఖ్యమైనవి
1) ముక్కు చెవులు ఖండించడం ద్వారా అంగ వైకల్యం చేయడమనే క్రూరమైన శిక్షల రద్దు
2) మత్తు పానీయాలు, మత్తు మందు నిషేధం
3) కొన్ని ప్రకటిత దినాల్లో జంతువధ నిషేధం
4) రహదారుల్లో ఉచిత వైద్యశాలలు, మసీదులు, ధర్మశాలల నిర్మాణం.
5) ప్రజలకు న్యాయాన్ని చేకూర్చుటకై బంగారు గొలుసు గంటను అమర్చాడు.
నేను ఒక గిన్నెడు ద్రాక్షా పానానికి, ఒక పాత్ర మాంసానికి  నా రాజ్యాన్ని నా ప్రియమైన రాణికి 
అమ్ముకొన్నా అని జహంగీర్‌ తన స్మృతులలో విచారం వ్యక్తం చేశాడు.
జహంగీర్‌ అక్బర్‌ సమాధిని సికిందరా వద్ద నిర్మించాడు.

నూర్దహాన్‌:

నూర్జహాన్‌ మొదటి పేరు మెహరున్నీసా. జహంగీర్‌తో వివాహం అయిన తర్వాత మొదట నూర్‌ మహల్‌ 
(అంతఃపుర జ్యోతి) అని, ఆ తర్వాత నూర్జహాన్‌ (ప్రపంచజ్యోతి) అని పిలవడం జరిగింది.
మొదటి భర్త షేర్‌ ఆఫ్ఘాన్‌.
మొహరున్నీసా, షేర్‌ ఆష్టాన్‌కు జన్మించిన కుమార్తె లాడ్లీబేగం
ఈమె తండ్రి ఘియాజ్‌బేగ్‌. ఇతని బిరుదు ఇతిముదధౌలా. ఈమె సోదరుడు ఆసఫ్‌ఖాన్‌
తన తండ్రి జ్ఞాపకార్థం ఇతిముడ్దైలా అనే సమాధిని ఆగ్రాకి దగ్గర్లో నిర్మించింది. (పూర్తిగా పాలరాతితో 
నిర్మితమైన మొట్టమొదటి కట్టడం)
ఈ కట్టడంలో మొట్టమొదటిసారిగా పియత్రాదుర (పిట్రాడ్యూరా) విధానం ఉపయోగించబడింది. 
(గోడలపై ఖురాన్‌ శ్లోకాలను, ఇతర చిత్రాలను చెక్కడాన్నిి విలువైన రాళ్లను నగీషులుగా అమర్చడాన్ని 
పియత్రాదుర అంటారు)
ఈమె గులాబీల నుండి మొదటిసారిగా సుగంధం (సెంటు)ను తయారు చేసింది.
ఈమె కుమార్తె లాడ్లీ బేగంను షరయార్‌ కిచ్చి వివాహం చేసింది.
ఈమె నూర్లహాన్‌ జుంటాను ఏర్పాటు చేసింది. దీనిలో సభ్యులు నూర్జహాన్‌, అసఫ్‌ఖాన్‌, షాజహాన్‌, 
షరయార్‌ మొదలగువారు.

షాజహాన్‌ (1628-1658) 

founder of Mughal Dynasty,Mughal Dynasty founder,introduction to Mughal Dynasty in telugu,Mughal Dynasty introduction in telugu,history of Mughal Dynasty in telugu,Mughal Dynasty history in telugu,history of babar Mughal Dynasty in telugu,history of delhi sultanate in telugu,delhi sultanate in telugu,tspsc group2 indian history in telugu,indian history Mughal Dynasty in telugu,Mughal Dynasty notes in telugu,Mughal Dynasty study material in telugu,delhi sultanate notes in telugu,delhi sultanate study material in telugu,list of kings of Mughal Dynasty,Mughal Dynasty kings,Mughal Dynasty empire,list of kings of delhi sultanate in telugu,Mughal empire kings,Mughal Dynasty upsc,Mughal Dynasty tspsc,kings of Mughal Dynasty,mughal empire shah jahan history in telugu,history of mughal empire shah jahan,mughal empire shah jahan wife name,wife name of mughal empire shah jahan,mughal empire shah jahan battles list,battles list of mughal empire shah jahan,mughal empire shah jahan invasion,
తల్లిపేరు తాజ్‌బీబీ- బిల్లిస్‌-మకాని (మార్వార్‌ రాకుమార్తె మన్మతి)
షాజహాన్‌ను అక్బర్‌ మొదటి భార్య రుకయ్య సుల్తాన్‌బేగం పెంచింది.
షాజహాన్‌ పూర్తిపేరు “ఆలా హజరత్‌ అబుల్‌ ముజాఫర్‌ షాహబుద్దీన్‌ మహమ్మద్‌ ఖుర్రం”.
1628-ఖుర్రం షాజహాన్‌ అనే బిరుదును పొంది సింహాసనంను అధిష్టించాడు.
1631-53- తాజ్‌మహల్‌ నిర్మాణం జరిగింది.
1649-కాందహార్‌ శాశ్వతంగా భారతదేశం నుండి వేరు చేయబడింది.
1658-బెరంగజేబు షాజహాన్‌ను తొలగించి మొఘల్‌ చక్రవర్తి  అయ్యాడు. షాజహాన్‌ ఆగ్రా కోటలో ఉంచబడ్డాడు.  షాజహాన్ కుమార్తె  జహానార షాజహాన్  సేవ చేసింది.
1666 -షాజహాన్‌ మరణించాడు
ఇతను మన్సబ్‌దారీ విధానంలో జమాదాని/నెలవారీ జీతం విధానం ప్రవేశపెట్టాడు.
శిస్తు వసూలులో హిజారా(వేలంపాట) ప్రవేశపెట్టాడు
కట్టడాలు:
1) తాజ్‌మహల్‌:
దీని ఆర్కిటెక్చర్‌ -ఉస్తాద్‌ అహ్మద్‌ లహోరి
సహాయకుడు - ఉస్తాద్‌ ఇసా
ఇది ముంతాజ్‌మహాల్‌ సమాధి
ఈమె బిరుదు - మాలిక్‌-ఇ-జమాలీ
దీని నిర్మాణంలో అతి ఎత్తైనది మధ్యలో ఉన్న గుమ్మటం. దీన్ని చెక్క పునాదులతో నిర్మించారు (భూకంపాల వల్ల నష్టం ఉండదు).
ఇస్లాం సాంప్రదాయం ప్రకారం కయామత్‌ నాడు దేవుని సింహాసనం తాజ్‌మహల్‌లాగా ఉంటుందని భావిస్తారు.
ముంతాజ్‌ను మొదటగా బుర్దాన్‌పూర్‌ (మహారాష్ట్ర)లో గల జైనాబాద్‌లో పూడ్చారు. ఈమె బుర్దాన్‌పూర్‌లో 14వ బిడ్డకు జన్మనిచ్చి మరణించింది. 14వ బిడ్డ పేరు గౌహరాబేగం.
 ముంతాజ్‌మహాల్‌ అసలు పేరు అర్జమంగ్‌ బేగం(అంజుమన్‌ భానుబేగం) లేదా నవాబ్‌ ఆలియా  బేగం. ఈమెను ముంతాజ్‌ మహల్‌(అంత:పుర ఆభరణం) అని కూడా పిలుస్తారు. ఈమెకు గుర్తుగా షాజహాన్‌ తాజ్‌మహల్‌ నిర్మాణం 1631లో ప్రారంభించాడు.
తాజ్‌మహల్‌ ముంతాజ్‌ బేగం జ్ఞాపకార్థంగా యమునా తీరంలో నిర్మించబడింది.
తాజ్‌మహల్‌ నిర్మాణానికి 22 సంవత్సరాలు పట్టింది. 3 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. 22 వేల మంది పనివారు వినియోగించబడ్డారు.
2) ఎర్రకోట:
దీని శిల్పి హమీద్‌
దీనిలో నిర్మాణాలు
1) హీరామహల్‌
2) మోతీమహల్‌
3) రంగామహల్‌ (అతి ముఖ్య కట్టడం)
4) షీష్‌మహల్‌
5) పెర్ల్‌మాస్క్‌ (ఔరంగజేబు నిర్మించాడు)
6) దివానీ ఖాస్‌
తన ఆస్థానంలో షాజహాన్‌ కోహినూర్‌ వజ్రం, నెమలి సింహాసనంను ఉంచాడు.
ఇక్కడ ఒక శ్లోకం లభ్యమైంది. “ప్రపంచంలో స్వర్గమంటూ ఉంటే అది ఇదే అది ఇదే" మీర్‌ జుమ్లా షాజహాన్‌కు కోహినూర్‌ వజ్రం ఇచ్చాడు. (అబ్దుల్లా కుతుబ్‌షా ప్రధాని)
షాజహాన్‌ ఇతర అంశాలు:
షాజహాన్‌ పాలన తొలినాటి కాలంలో దక్కన్‌, గుజరాత్‌లో తీవ్రమైన కరువులు సంభవించాయి.
మొగల్‌ వాస్తు కళకు షాజహాన్‌ కాలం స్వర్ణయుగంగా చెప్పవచ్చు. ఢిల్లీలోని ఎర్రకోటకు కొద్ది దూరంలో జామా-ఇ-మసీదు ప్రపంచంలోని పెద్ద మసీదులలో ఒకటి.
షాజహాన్‌ అలీమర్షన్‌ఖాన్‌ పర్యవేక్షణలో షాలిమర్‌ ఉద్యానవనాలు వేయించాడు. నెమలి సింహాసనం, కోహినూర్‌ వజ్రం సామ్రాజ్య వైభవాన్ని పెంపొందించాయి.
నేటి ఢిల్లీనగర స్థాపకుడు, వాస్తుకళా ప్రభువు, ఇంజనీర్‌ కింగ్‌ అని షాజహాన్‌ను పిలిచారు.

ఔరంగజేబు (1658-1707) 

founder of Mughal Dynasty,Mughal Dynasty founder,introduction to Mughal Dynasty in telugu,Mughal Dynasty introduction in telugu,history of Mughal Dynasty in telugu,Mughal Dynasty history in telugu,history of babar Mughal Dynasty in telugu,history of delhi sultanate in telugu,delhi sultanate in telugu,tspsc group2 indian history in telugu,indian history Mughal Dynasty in telugu,Mughal Dynasty notes in telugu,Mughal Dynasty study material in telugu,delhi sultanate notes in telugu,delhi sultanate study material in telugu,list of kings of Mughal Dynasty,Mughal Dynasty kings,Mughal Dynasty empire,list of kings of delhi sultanate in telugu,Mughal empire kings,Mughal Dynasty upsc,Mughal Dynasty tspsc,kings of Mughal Dynasty,mughal empire aurangzeb history in telugu,history of mughal empire aurangzeb in telugu,mughal empire aurangzeb battles list,battles list of mughal empire aurangzeb in telugu,mughal empire aurangzeb invasion,mughal empire aurangzeb  wife name,mughal empire aurangzeb father name,
పూర్తిపేరు అబుల్‌ ముజఫర్‌ మొహిద్దీన్‌ మహమ్మద్‌ ఔరంగజేబు
ఇతను షాజహాన్‌ యొక్క 3వ కుమారుడు లేదా 6వ. సంతానం. 1618లో గుజరాత్‌లోని దాహోద్‌లో జన్మించాడు.
ఇతను 1637లో దిల్‌రాస్‌ భాను బేగం (రబీవద్దీన్‌ దురానీ)ను వివాహం చేసుకున్నాడు.
ఇతను మొగల్‌ ప్రతినిధిగా దక్కన్‌లో ఉన్నపుడు వీణ వాయించడం నేర్చుకున్నాడు. ఇతను హీరాబాయ్‌ అనే మహిళను ప్రేమించాడు.
ఇతని మరో భార్య ఉదయ్‌పూరీబాయ్‌
1658 - సముర్‌ఘడ్‌, ధర్శత్‌ యుద్ధాలలో ఔరంగజేబు ధారాషుకోను ఓడించి మొఘల్‌ చక్రవర్తి అయ్యాడు.
ఇతని బిరుదులు - 1) ఆలంగీర్‌ (ప్రపంచ విజేత)  2) జిందాపీర్‌ 3) దార్వేష్‌
1660-63 - శివాజీని పట్టుకొనుటకు షహస్థాఖాన్‌ మరాఠా రాజ్యానికి పంపబడ్డాడు.
1665  - బెరంగజేబు మన్సబ్‌దార్‌ జైసింగ్‌ శివాజీని ఓడించి పురందర్‌ ఒప్పందంపై నంతకం చేయించాడు.
1675 - సిక్కుల 9వ గురువు తేజ్‌ బహదూర్‌ చంపబద్దాడు
1679 - జిజియా పన్నును తిరిగి ప్రవేశపెట్టాడు.
1686  - భీజాపూర్‌ను ఆక్రమించాడు
1687  - గోల్కొండను ఆక్రమించాడు
1689 - సంగమేశ్వర్‌ యుద్ధంలో శివాజీ కుమారుడు శంభాజీ చంపబడ్డాడు.
1707  - బెరంగజేబు మరణం.
ఔరంగజేబు మరణం తర్వాత మువాజం మరియు ఆజంల మధ్య వారనత్వ పోరు జరిగింది. మువాజం గురుగోవింద్‌ యొక్క సహాయంతో జజవ్ అనే యుద్ధంలో ఆజంను ఓడించి, సింహాసనాన్ని అధిష్టించాడు. మువాజం గురుగోవింద్‌కు “హింద్‌ కా పీర్‌” అనే బిరుదు ఇచ్చాడు.
బెరంగజేబు నౌరోజీ ఉత్సవాలను, తులాభారంను, ఝరోకా దర్శన్‌ను రద్దు చేశాడు. సతీ సహగమనంను నిషేధించాడు.
నాణెములపై ఖురాన్‌ శ్లోకాలను తొలగించాడు. ఖురాన్‌ను కంఠస్థం చేశాడు. సంగీతాన్ని లోతుగా మట్టిలో పాతిపెట్టమన్నాడు
దక్కన్‌ విధానం:
దీనిలో 4 దశలు ఉన్నాయి
1) 1658-66: ఈ దశలో కేవలం షోలాపూర్‌ను ఆక్రమించాడు. శివాజీ ఓడించబడ్డాడు.
2) 1666-85: గోల్కొండ, బీజాపూర్‌, శివాజీల కూటమి కారణంగా ఇతను విజయాలు సాధించలేకపోయాడు. ఈ కూటమిలో కీలకపాత్ర పోషించింది అక్కన్న-మాదన్న
3) 1686-87: 1686లో బీజాపూర్‌ను, 1687లో గోల్కొండను ఆక్రమించాడు.
4) 1689: సంగమేశ్వర్‌ యుధ్ధంలో శంభాజీ చంపబడ్డాడు.
ఔరంగజేబు తన భార్య రబివుద్దీన్‌ దురానీ జ్ఞాపకార్థం  ఔరంగాబాద్‌లో బీబీకా మక్సారా/ మినీ తాజ్‌మహల్‌ను నిర్మించాడు.
జాట్స్‌ స్థాపకులు -చూరామన్‌ మరియు బాదన్‌సింగ్‌
ఔరంగజేబు జాట్స్‌ నాయకుడైన గోకుల్‌ను తిల్పోత్‌ యుద్దంలో ఓడించాడు.
జాట్స్‌ పాలకుడు రాజారాం సికిందరాలోని అక్బర్‌ సమాధిని దోచుకున్నాడు.
జాట్స్‌ నాయకుడు సూరజ్‌మల్‌ను ప్లాటో ఆఫ్‌ జాట్స్‌ అంటారు.
1707లో ఔరంగజేబు మరణానంతరం మొఘల్స్ బలహీనమయ్యారు. అందువల్లనే బెరంగజేబు తర్వాత పాలకులను మలి మొఘలులు అంటారు.

మలి మొఘలులు

మలి మొగల్‌ చక్రవర్తులు:
1. బహదుర్‌షా -1 (1707-12)
2. జహందర్‌ -(1712-13)
3. ఫారుక్‌ సియార్‌ -1718-19
4. రఫి ఉద్‌ ధర్దట్‌ -క719
5. రఫి ఉద్దౌలా (షాజహాన్‌-2) - 1719
6. మొహ్మద్‌షా రంగీలా(రోషన్‌ అక్తర్‌)   -1719-48
7. అహ్మద్‌షా -1748-54
8. ఆలంగిర్‌-2 (అజీజద్దీన్‌)  -1754-59
9. షాజహాన్‌-3 -1759
10. ఆలీ గౌహర్‌/షాఆలం-2 -1759-1806
11. అక్చర్‌-2 -1806-37
12. బహదుర్‌షా-2 -1837-62
మువాజం(1వ బహదూర్‌షా/ 1వ షా ఆలం):
ఔరంగజేబు మరణానంతరం తన కుమారులైన మువాజం, షాషుజా, మురాత్‌ల మధ్య వారసత్వ పోరు జరిగింది.
మువాజం 10వ సిక్కు గురువైన గురు గోబింద్‌ సింగ్‌ సహాయం పొంది అతని సేనాని అయిన ధరమ్‌సింగ్‌తో కలసి షాషుజాను ఖజ్వా యుద్ధంలో ఓడించి సింహాసనాన్ని అధిష్టించాడు.
ఇతడు అసమర్దుడైన 64 ఏళ్ల ముసలివాడు అయినందువల్ల ఇతన్ని షా-ఇ-బేఖబర్‌(యోచనలేని రాజు) అని పిలిచేవారు.
జహందర్‌ (1712-13)

జహందర్‌ ఆస్థానంలో ప్రధాని జుల్‌ఫికర్‌  కింగ్‌ మేకర్‌గా ప్రసిద్ధి చెందాడు.
జహందర్‌ జిజియా పన్ను రద్దు చేశాడు.
జహందర్‌ మీర్జా రాజాసవాయ్‌(అంబర్‌ పాలకుడు)కు జైసింగ్‌ అనే బిరుదును, అజిత్‌సింగ్‌కు మహరాజా అనే బిరుదును ఇచ్చాడు.
సవాయి జైసింగ్‌(1699-1743) -ఢిల్లీ, జైపూర్‌, ఉజ్ఞయిని, వారణాసి, మధురలలో అబ్జర్వేటరీ (ఖగోళ పరిశోధన కేంద్రం) ఏర్పాటు చేశాడు.
సవాయి జైసింగ్‌ జిజ్‌ మొహమ్మద్‌ షాహి అనే టేబుల్‌/ పట్టికను రూపొందించాడు.
యూక్లిడ్‌ యొక్క ఎలిమెంట్స్‌ ఆఫ్‌ జామెంట్రీను సంస్కృతంలోకి అనువదించాడు.
జైసింగ్‌ వితంతు పునర్వివాహమును ప్రోత్సహించాడు.
మొగల్‌ ఆస్థానంలో సయ్యద్‌ సోదరులు(అబ్దుల్లా, హుస్సేన్‌) కింగ్‌ మేకర్స్‌గా ప్రసిద్ధి చెందారు. వీరు జహందర్‌ను తొలగించి ఫరూక్‌సియార్‌ని మొఘల్‌ పాలకున్ని చేశారు.
ఫరూఖ్‌ సియర్‌ (1718-19)

ఫరూఖ్‌ సియర్‌ పాలనా కాలంలో సిక్కుల నాయకుడైన బందాబహదూర్‌ ఉరితీయబడ్డాడు.
ఇతను 1717లో బ్రిటిష్‌వారికి బంగారు ఫర్మాన్‌ జారీచేశాడు.
ఇతను సయ్యద్‌ సోదరులచే హతమార్చబద్దాడు.
1719లో ఇతని మరణానంతరం రఫీఉద్‌ దర్దట్‌, రఫీ ఉద్‌ దౌలాలు మొఘల్‌ పాలకులయ్యారు.
మొహహ్మద్‌ షా రంగీలా (1719-48)
ఇతన్ని రోషన్‌ అక్తర్‌ అని కూడా అంటారు.
ఇతను సయ్యద్‌ సోదరుల మద్దతుతో పాలకుడయ్యాడు.
ఇతని పాలనాకాలంలో భారతదేశంలో మొఘల్స్‌ నుంచి వేరై 4 కొత్త రాజ్యాలు ఆవిర్భవించాయి. అవి
1 హైదరాబాద్‌ -నిజాముల్‌ ముల్మ్‌
2 కర్ణాటిక్‌ -సాదతుల్లాఖాన్‌
3 అవధ్‌ -సాదత్‌ అలీ
4 బెంగాల్‌ -ముర్షీద్‌ కులీ ఖాన్‌
ఇతని కాలంలో 1789లో నాదిర్‌షా కర్నల్‌ యుద్ధంలో మొఘల్‌ సైన్యాన్ని ఓడించి ఢిల్లీని ఆక్రమించి, ప్రసిద్ధ కోహినూర్‌ వజ్రం మరియు షాజహాన్‌ తయారుచేయించిన నెమలి సింహాసనంను ఎత్తుకుపోయాడు.
మొహ్మద్‌షా రంగీలా కథక్‌నాట్యంలో ప్రావీణ్యం గలవాడు.
ఇతను నిజాముల్‌ ముల్క్‌ సహాయాన్ని పొంది, సయ్యద్‌ సోదరులను హతమార్చాడు.
ఇతనికి చివరిగా ప్రధాన మంత్రిగా వ్యవహరించినవాడు ఇమాదుల్‌ ముల్క్‌
అహ్మద్‌ షా (1748-54)
ఇతను ఇమాదుల్‌ ముల్క్‌ సహాయంతో పాలకుడయ్యాడు.
ఇతనికి, ప్రధాని ఇమాదుల్‌ ముల్మ్‌ మధ్య విభేదాలు రావడంతో ఇమాదుల్‌ ముల్క్‌ అహ్మద్‌ షాను గుడ్దివాడిని చేసి సింహాసనం నుండి తొలగించాడు.
2వ ఆలంగీర్‌ (1754-59)

ఇతను కూడా ఇమాదుల్‌ ములక్ ‌సహాయంతో పాలకుడయ్యాడు.
ఇతను ప్రధానితో విభేదాలు ఏర్పరచుకోవడంతో ఇమాదుల్‌ ముల్క్‌ రెండవ ఆలంగిర్‌ను హత్యచేసి అతని శవాన్ని యమునా నదిలో పడేశాడు.
ఇతని తర్వాత నామమాథత్రంగా 3వ షాజహాన్‌ సింహాసనంను అధిష్టించాడు.
2వ షా ఆలం/ షా గౌహర్‌ (1759-1806)

ఇతను ప్రధాని ఇమాదుల్‌ ముల్మ్‌కి భయపడి ఢిల్లీని విడిచిపెట్టి అలహాబాద్‌కు పారిపోయాడు. (ఫ్యూజిటివ్‌ ఎంఫెరర్‌)
ఇతని కాలంలోనే 1764లో బాక్సర్‌ యుద్ధం జరిగింది. దీని తరువాత ఇతను అలహాబాద్‌లో బ్రిటిష్‌ బందీగా వున్నాడు. ఇతని కాలం నుంచే మొఘల్‌ చక్రవర్తులు బ్రిటిష్‌ యొక్క పెన్షనర్లుగా మారారు.
మరాఠా పీష్వా 1వ మాధవరావు 2వ షా ఆలంను తిరిగి ఢిల్లీకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు.
2వ అక్చర్‌ (1806-87)
రెండవ అక్బర్‌ రామ్మోహన్‌రాయ్‌కి రాజా అనే బిరుదు ఇచ్చి, ప్రోత్సహించి అతన్ని లండన్‌కు పంపాడు.
(భారతదేశంలో కొన్ని సంఘసంస్కరణ చట్టాలు, తన పెన్షన్‌ పెంచమని విజ్ఞప్తులు చేయుటకు)
మొఘల్‌ రాజులలో చివరివాడు రెండవ బహదుర్‌షా(1837-58). ఇతడు 1857లో జరిగిన తిరుగుబాటులో నాయకత్వం వహించాడు. తిరుగుబాటు అణచివేసిన తర్వాత అంగ్లేయులు బహదుర్‌షాను ఖైదీగా 'రంగూన్‌'కు పంపారు. అచటనే బహదుర్‌షా 1862లో మరణించాడు.
మొఘల్‌ పరిపాలన:
మొగలుల కాలంలో జాగీర్‌(అనేది ఒక భూభాగం). ఇది ఢిల్లీ సుల్తాన్‌ల కాలంలో ఇక్తాను పోలి ఉంది.
వీరి పాలనలో వకీల్‌ -రాజప్రతినిధి
వజీర్‌ లేదా దివాన్‌ - రెవెన్యూ శాఖాధిపతి (ప్రధానమంత్రిగా/ ఆర్థిక మంత్రిగా)
మీర్‌ బక్షి - సైనిక శాఖాధిపతి
కాజీ - ఫిర్యాదులను విని తీర్పు చెప్పేవాడు
అమీల్‌ - భూమిశిస్తును వసూలు చేసేవాడు
మొగల్‌ పాలనలో దస్తూర్‌ ఉల్‌ అమీర్‌ అనే గ్రంథం రచించబడింది.
వీరి కాలంలో ప్రామాణిక బంగారు నాణెంను మహర్ అనేవారు.
వీరికి పర్షియన్‌ రాజభాషగా ఉండేది.
అక్బర్‌ సైనికుల గుర్తింపు చిహ్నాలను, గుర్రాలకు ముద్రవేసే పద్ధతి, పట్టికలలో సైనికుల వివరాలను నమోదు చేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు.
అక్బర్‌ పరిపాలనలో సాధించిన గొప్ప విజయం భూమిశిస్తు విధానం. దీన్ని రెవెన్యూ మంత్రి తొడర్‌మల్‌ ప్రవేశపెట్టాడు. ఈ విధానాన్ని “బందోబస్త్‌ / ఐనీదాసలి విధానం అని కూడా అంటారు. దీని ప్రకారం శిస్తు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్ణయించబడుతుంది.
దీనిలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన శిస్తు సరాసరి ఫలసాయంలో మూడో వంతు నిర్ణయించబడింది.
కరువు కాలంలో రైతులు కట్టవలసిన శిస్తు తగ్గించి వారికి విత్తనాలు, పశువులు కొనడానికి 'తక్కావీ' బుణాలు ఇచ్చేవారు.
మొఘల్‌ల కాలంలో నేత పరిశ్రమ మొదటిగా అభివృద్ధి చెందింది. దీనికి ఆగ్రా, వారణాసి(బనారస్‌), పాట్నాలో  దీని ఉత్పత్తి కేంద్రాలున్నాయి. ఢాకాలో పట్టు పరిశ్రమ, లాహోర్‌లో శాలువల పరిశ్రమ, సియల్‌కోటలో కాగితపు పరిశ్రమలున్నాయి.
భూమి 4 విధాలుగా విభజించబడింది. అవి
1. పోలజ్‌
2. పరౌతి
3. కాచల్‌
4. బంజర్‌
అక్బర్‌ ఆస్థానంలో వచ్చిన రాల్ఫ్‌పిచ్‌ అనే ఆంగ్లేయ యాత్రికుడు ఆగ్రా, ఫతేపూర్‌ సిక్రీలను రెండు మహానగరాలనీ, రెండూ లండన్‌ నగరానికన్నా పెద్దవనివర్లించాడు.
ఫాదర్‌ మాన్సరోట్‌ అనే జెసూట్‌ మత ప్రచారకుడు లాహోర్‌ మహానగరాన్ని వర్ణించాడు.
సమాధులు:
బాబర్‌ - కాబూల్‌ (మొదట్లో ఆగ్రా వద్ద పూడ్చబడ్డాడు)
హుమయూన్‌ - ఢిల్లీ
షేర్షా - ససారామ్‌ (బీహార్‌)
అక్బర్‌ - సికిందరా
founder of Mughal Dynasty,Mughal Dynasty founder,introduction to Mughal Dynasty in telugu,Mughal Dynasty introduction in telugu,history of Mughal Dynasty in telugu,Mughal Dynasty history in telugu,history of babar Mughal Dynasty in telugu,history of delhi sultanate in telugu,delhi sultanate in telugu,tspsc group2 indian history in telugu,indian history Mughal Dynasty in telugu,Mughal Dynasty notes in telugu,Mughal Dynasty study material in telugu,delhi sultanate notes in telugu,delhi sultanate study material in telugu,list of kings of Mughal Dynasty,Mughal Dynasty kings,Mughal Dynasty empire,list of kings of delhi sultanate in telugu,Mughal empire kings,Mughal Dynasty upsc,Mughal Dynasty tspsc,kings of Mughal Dynasty,
జహంగీర్‌ - లాహోర్‌ (షహాదరా వద్ద)
నూర్జహాన్‌ - లాహోర్‌
షాజహాన్‌ - ఆగ్రా
ఔరంగజేబు - ఔరంగాబాద్‌ (ఖుల్దాబాద్‌)
సాహిత్యం:
బాబర్‌:
బాబర్‌ - బాబర్‌నామా, /తుజ్కి బాబరీ (టర్కీ భాషలో), మస్నవి
మీర్జా హైదర్‌ - తారిక్‌-ఇ-రషీదీ
హుమాయూన్‌ : 
గుల్‌బదన్‌ బేగం - హుమయూన్‌ నామా
నిజాముద్దీన్‌ అహ్మద్‌ -తబాకత్‌-ఇ-అక్చరీ
షేర్షా:
అబ్బాస్‌ షేర్వాణీ - తాజుకీ-ఇ-షేర్హాహీ
మాలిక్‌ మహ్మద్‌ జైసి _ - పద్మావతి (హిందీ)
అక్బర్‌:
బదౌనీ : ముక్తకా-ఉల్‌-తవారిక్‌, రామాయణంను పర్షియాలోకి అనువదించాడు.
అబుల్‌ ఫజల్‌ : అక్బర్‌ నామా/ఐనీ అక్బరీ, పంచతంత్రంను పర్షియాలోకి అనువదించాడు(కలీలదిమ్మ అనే పేరుతో)
అబుల్‌ ఫైజీ : భగవద్గీతను పర్షియాలోకి, గణితశాస్త్ర గ్రంథమైన లీలావతిని పర్షియాలోకి అనువాదించాడు. నలదమయంతిని కూడా పర్షియాలోకి అనువదించాడు.
బదౌనీ, నాకిబ్‌ఖాన్‌: మహాభారతాన్ని పర్షియాలోకి అనువదించారు(రజంనామా అనే పేరుతో)
హజీ ఇబ్రహీం : అధర్వణవేదంను పర్షియాలోకి అనువదించాడు.
నాకిబ్‌ఖాన్‌, ముల్లా మొహ్మద్‌, జాఫర్‌బేగ్‌:
తారిక్‌-ఇ-అల్ఫీ రచించారు. (ఇస్లాం మతాన్ని స్థాపించి 1000సం॥లు పూర్తైన సందర్భంగా)
అబ్బాస్‌ షేర్వాణి: తోఫా-ఇ-అక్చర్‌ షాహీ
తులసీదాస్‌ - రామచరితమానస్‌
జహంగీర్‌:
జహంగీర్‌ - జహంగీర్‌ నామా
ముతామిద్‌ ఖాన్‌ -ఇక్చాల్‌-ఇ-నామా జహంగరీ
షాజహాన్‌:
ఉస్తాద్‌-హమీద్‌ లహోరి : బాద్‌షా నామా (ఆస్థాన చరిత్రకారుడు)
మొహ్మద్‌ షా/ఇనాయత్‌ షా : షాజహాన్‌ నామా
జగన్నాథ పండితుడు : రసగంగాధరం (హిందీ), గంగాలహరి(హిందీ)
ధారాషుకో : మజ్మ-ఉల్‌-బహ్రాయిన్‌, ఇతను ఉపనిషత్తులను, భగవద్గీతను, దోహాస్‌, యోగవిస్తారను పర్షియాాలోకి అనువధించాడు. ఇతను ఉపనిషత్తులను షకినల్‌- ఉల్-ఔలియా అనే పేరుతో పర్షియాలోకి అనువదించాడు.
ఔరంగజేబు:
ఔరంగజేబు యొక్క ఉత్తరాలు రకాలుత్‌-ఉల్‌-ఆలంగిర్‌ అనే పుస్తకంలో సేకరించబడ్డాయి.
కాఫీఖాన్‌ : ఇతను ఆస్థాన చరిత్రకారుడు. ముక్తక్‌-ఉల్‌-లుబాబ్‌ను రచించాడు. దబిస్తాన్‌ మజ్‌హబ్‌ను కూడా రచించాడు.
ముస్టైదీఖాన్‌ : మజరీ ఆలంగిరి
మీర్జా మొహమ్మద్‌: ఆలంగిర్‌ నామా
సర్జునరాయ  : కులాసా-ఉల్‌-తవారిక్‌
అనేకమంది కలసి ఫత్వా-ఇ-ఆలంగిరిని రచించారు.
ఇతర పుస్తకాలు:
మజ్డా  - జాఫర్‌నామా
తూసి - సియాసత్‌ నామా
ఉర్దూ పదం ఓర్దు అనే టర్కీ పదం నుంచి వచ్చింది. ఓర్దు అంటే సైనిక శిబిరం.
మొఘల్‌ సామ్రాజ్యానికి విచ్చేసిన ఆంగ్ల రాయబారులు/ యాత్రికులు:
అక్బర్‌:  
1) మాన్సరేట్‌ (పోర్చుగీసు)
2) రాల్ఫ్‌ఫిచ్‌ (ఆంగ్లేయుడు) (1588-91)
జహంగీర్‌:  
1) హాకిన్స్‌ (1608-13)
2) విలియం ఫిచ్‌ (1608)
3) జాన్‌ జౌర్దన్‌ (1608-18) ఆంగ్లేయుడు, ఆగ్రాను వర్ణించాడు.
4) సర్‌ థామస్‌రో (1615-19)
 5) నికోలస్‌ వితింగ్టన్‌ (1616-19) (ఇతను సతీసహగమనంను పొగుడుతూ వ్యాసాలు రాశాడు)
షాజహాన్‌:
1) ట్రావెర్నియర్‌ (1641-87) (ఫ్రెంచ్ వజ్రాల వర్తకుడు)
2) పీటర్‌ ముండీ (షాజహాన్‌ కాలంలో కరువును వివరించాడు)
3) బెర్నియర్‌ (ఫ్రెంచ్  వైద్యుడు) (దారాషుకో ఉరిని గూర్చి వివరించాడు)
4) మనుక్కి (ఇటలీ) -దారాషుకో యొక్క ఆర్టిలరీ అధికారి
ఔరంగజేబు: 
నోరిస్ - (ఇతను బ్రిటీష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ రాయబారి)
గార్డెన్స్‌ /ఉద్యావనాలు:
బాబర్‌ -చార్‌బాగ్‌, కాబూల్‌బాగ్‌, రామ్‌బాగ్‌
అక్బర్ -పింజోర్‌(పంజాబ్‌), రాంబాగ్‌(ఢిల్లీ), నాసింబాగ్‌(శ్రీనగర్‌)
జహంగీర్‌ -నిషామద్‌(లాహోర్‌), షాలిమర్‌(శ్రీనగర్‌)
షాజహాన్ -షాలిమర్‌(లాహోర్‌), మొగల్‌ గార్డెన్స్‌ (ఆగ్రా), అంగూరీబాగ్‌(ఆగ్రా)
ముంతాజ్‌మహల్‌ -రోజ్‌ గార్డెన్‌ (ఆగ్రా)
కాశ్మీర్ లోని దారా గార్డెన్‌ను వజీర్‌బాగ్‌ అంటారు.
మొఘల్‌ల రాజధానులు :
అగ్రా (1526 - 1571)
ఫతేపూర్‌సిక్రి ( 1571-1585)
లాహోర్‌ (1585-1598)
ఆగ్రా ( 1598-1648)
ధిల్లీ / షాజహానాబాద్‌ (1648-1857)